ఎన్నికల పండక్కి.. విశాఖకు రండి!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు.
దేశంలోని పలు ప్రాంతాల్లో నగర వాసులు
ముందస్తు ప్రణాళిక ఉంటే మేలు
ఓటు హక్కు వినియోగిస్తేనే ప్రజాప్రభుత్వం ఏర్పాటు
ఈనాడు, విశాఖపట్నం
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించింది. యువత ఉపాధి అవకాశాలకు గండిపడింది. జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ దగా చేసిన తీరు తేటతెల్లమయింది. అనేక ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా రాష్ట్రం వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నెల 13న ఎన్నికల పండగ జరగనుంది. ఆ రోజు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఉపయోగించుకొని సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు. విశాఖకు చెందిన అధిక సంఖ్యలో ఓటర్లు వృత్తి, వ్యాపార, విద్యావసరాల దృష్ట్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వీరంతా ఆ రోజు నగరానికి వచ్చి ఓటేయాలంటే...ముందస్తుగా ప్రణాళిక చేసుకోక తప్పదు. రైళ్లు, బస్సులు రద్దీగా ఉన్నాయని, టికెట్లు దొరకలేదని నిర్లిప్తత వహిస్తే భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే బంగారంలాంటి అవకాశం చేజారిపోతుంది.
విశాఖ జిల్లాకు చెందిన అధిక సంఖ్యలో యువత ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. పెద్ద సంఖ్యలోనే యువతీ, యువకులు చదువులు సాగిస్తున్నారు. వీరిలో యువతులు, మహిళలు ఉన్నారు. ఐటీ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారూ అధికమే. అలాగే వివిధ రకాల వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం కొంతకాలం ఆయా ప్రాంతాల్లో ఉంటున్నవారూ లేకపోలేదు. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వారు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, దిల్లీలోని ఐటీ సంబంధిత కంపెనీల్లో అధికంగా పనిచేస్తున్నారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంది. అలాగే కోల్కతా, భువనేశ్వర్, కొన్ని ఉత్తరాది ప్రాంతాల్లో వ్యాపారాలు సాగిస్తున్న వారూ ఉన్నారు. వీరే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రి పనులు చేసేవారు ఎక్కువే. కొన్ని నెలల పాటు అక్కడ ఉండి వస్తుంటారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల నిమిత్తం నగరానికి వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలి. ఇందుకు ముందస్తు రిజర్వేషను తప్పదు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే రోజున ఆయా రాష్ట్రాల ఉద్యోగులకు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే...సమర్థ నేతను ఎన్నుకోవచ్చు.
ఓటింగు శాతం పెంచేలా: ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు తప్పకుండా వచ్చి ఓటేస్తే నగరంలో ఓటింగ్ శాతం మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో 65 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి 75 శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అపార్టుమెంటు వాసులు, గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చంద్రబాబే ముఖ్యమంత్రి!.. ఫలితాల తర్వాత వైకాపా కాలగర్భంలోకి..’
[ 22-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. -
నీటి సరఫరాలో గోల్‘మాల్’..!
[ 22-05-2024]
మండు వేసవిలో ప్రజలు తాగునీటికి అల్లాడుతుంటే అధికారులు మాత్రం ఓ భారీ మాల్కు నిత్యం లక్షల లీటర్ల నీటిని అనధికారికంగా తరలిస్తున్నారు. దీని కోసం కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా సమయాన్ని తగ్గించేశారనే విమర్శలొస్తున్నాయి. -
భారీ గోతులు.. నిత్య వెతలు!!
[ 22-05-2024]
విశాఖ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో గాజువాకలోని ఆటోనగర్ పారిశ్రామికవాడ మార్గమొకటి. ఆటోనగర్ ప్రవేశ ద్వారం వద్ద రహదారిని చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. -
తొలుత బ్యాలట్.. తర్వాత ఈవీఎం ఓట్లు..!
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 13న జరిగిన పోలింగ్లో జిల్లా వ్యాప్తంగా 70.02శాతం చొప్పున 14,09,118 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
మానవ అక్రమ రవాణా మూలాల ఛేదనకు ప్రత్యేక బృందాలు: సీపీ
[ 22-05-2024]
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కాంబోడియాలోని ఏజెన్సీలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న అంశంపై మరింత లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ రవిశంకర్ తెలిపారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద..భద్రత పరిశీలన
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ మల్లికార్జున మంగళవారం పరిశీలించారు. -
దువ్వాడ పూర్వ సీఐపై కేసు నమోదు
[ 22-05-2024]
దువ్వాడ పోలీస్స్టేషన్లో గతంలో పని చేసిన సీఐ బి.శ్రీనివాసరావుపై ఫోర్జరీ కేసు నమోదైంది. మంగళవారం దువ్వాడ ప్రస్తుత సీఐ ఎర్రన్నాయుడు తెలిపిన వివరాలివి. -
అప్పన్న ఆలయంలో నేడు నృసింహ జయంతి
[ 22-05-2024]
వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. -
త్వరలో రైతులకు గుర్తింపు కార్డుల జారీ
[ 22-05-2024]
జనవరి నెలలో ఎంపిక చేసిన రైతులకు త్వరలో గుర్తింపుకార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి యాసిన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు: కేఏ పాల్
[ 22-05-2024]
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై అనుమానాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. -
ఉక్కు కార్మికులకు సగం వేతనాలు చెల్లింపు
[ 22-05-2024]
ఉక్కు కార్మికులకు ఏప్రిల్ నెలకు సంబంధించి సగం వేతనాలను మంగళవారం చెల్లించారు. ఆ వివరాలు... మే నెల 21 రోజులు గడిచిపోయినా వేతనాల చెల్లింపులు లేకపోవడంతోఆగ్రహించిన కార్మికులు మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
చెరువు మట్టి.. తవ్వుకుంటే అడిగేదెవరేటి?
[ 22-05-2024]
చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మట్టి అమ్మకాల ద్వారా సొమ్ములు వెనకేసుకుంటున్నారు. -
బైకును ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 22-05-2024]
జాతీయ రహదారిపై ఉద్దండపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. -
రికార్డుల్లేని వాహనాల స్వాధీనం
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.