పోస్టల్ బ్యాలెట్లో కొరవడిన ముందుచూపు
జిల్లావ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి.
ఓటేయకుండా వెనుదిరిగిన ఉద్యోగులు
కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లావ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఆరు గంటల తరువాత లైన్లో ఉన్న అందరికీ ఓటు హక్కు కల్పించారు. పీవోలు, ఏపీవోలు, సూక్ష్మపరిశీలకులు, ఇతర పోలింగ్ అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లో ఓటు హక్కు వినియోగానికి తరలివచ్చారు. ఆరు నియోజకవర్గాల్లో మూడు రోజుల్లో 14162 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ రవి పేర్కొన్నారు. అత్యధికంగా అనకాపల్లి నియోజకవర్గంలో 2926 మంది, అత్యల్పంగా పాయకరావుపేట 1876 మంది వినియోగించుకున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోపంతో కసితో ఉద్యోగులు ఓటు వేశారని తెలుస్తుంది.
అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో బుధవారం గందరగోళం నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులకు బ్యాలెట్ ఇవ్వకపోవడంతో అక్కడే ఉన్న ఏఆర్వో, సిబ్బందిని ప్రశ్నించారు. విశాఖపట్నానికి చెందిన అత్యవసర విభాగానికి చెందిన ఉద్యోగులకు ఓటు వేయడానికి బ్యాలెట్ ఇవ్వలేదు. దీంతో వీరంతా గందరగోళానికి గురయ్యారు. మాడుగులకు చెందిన 25 మంది వైద్య సిబ్బందికి అవకాశం కల్పించలేదు. దీంతో వీరు ఎన్నికల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి బ్యాలెట్ ఓటింగ్కు ఐదురెట్లుకు పైగా ఉద్యోగులు ఊహించని విధంగా తరలిరావడంతో ఏర్పాట్లు చేయడంలో జిల్లా ఎన్నికల అధికారులు విఫలమయ్యారు. సంబంధిత ఉద్యోగులకు బ్యాలెట్ సరిపోకపోవడంతో అప్పటికప్పుడు ప్రింటింగ్ చేయించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు ఓటు వేయడానికి అవకాశం లేకుండా పోయింది.
సొంత జిల్లాలో ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రెండు రోజులు అవకాశం కల్పించిందని, చాలా మంది ఇక్కడే ఓటు వేయడానికి ఆసక్తి చూపడంలో బ్యాలెట్ సమస్య ఏర్పడిందని రోజారాణి పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోలేని ఉద్యోగులు నిరాశ పడాల్సిన అవసరం లేదని మే 13న జరిగే పోలింగ్లో సొంత పోలింగ్ కేంద్రానికి వెళ్లి నేరుగా ఓటు వేయవచ్చన్నారు. ఆరోజు ఆ ఉద్యోగులకు సెలవు సైతం ఇస్తారన్నారు.
కొత్తగా దరఖాస్తు చేసిన వారికీ...
ఎలమంచిలి, న్యూస్టుడే: ఎలమంచిలిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద మూడోరోజు ఉత్సాహంగా పోలింగ్ జరిగింది. ఎన్నికల విధులకు నియమించిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్టీసీ, వైద్యఆరోగ్య శాఖ, అంగన్వాడీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఓటు వేశారు. కొత్తగా ఎన్నికల విధులకు నియమించిన వారు ఇక్కడికి చేరుకుని ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరికీ తహసీల్దార్ ఓటు హక్కు కల్పించారు. 900 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
చిరంజీవిని కలిసిన గంటా
[ 19-05-2024]
భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్లో సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
కీలక పోరు.. ఓటర్ల జోరు
[ 19-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. -
ఎన్నికల ఖర్చులకు రూ.12 కోట్లు విడుదల
[ 19-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.12 కోట్లు విడుదల చేసింది. -
పోలింగులో యువ వెల్లువ
[ 19-05-2024]
ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి వెల్లువలా తరలివచ్చారు. -
ఓట్ల గణనకు 14 టేబుళ్లు.. 800మందికి పైగా సిబ్బంది
[ 19-05-2024]
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం’
[ 19-05-2024]
సింహాచలం దేవస్థానం తొలిసారిగా ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సును అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో సత్తా
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఎప్సెట్ ఫలితాలలో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!