నిలిచిన ఉచిత బియ్యం పంపిణీ
కొవిడ్ విపత్కర పరిస్థితులున్నప్పుడు పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈ నెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. గత నెలలో పంపిణీ నిలిపివేసినా.. మే నెలలో ఇస్తారని అధికారులు చెప్పారు. ఈ నెల 20వ తేదీ
నగరంలో రేషన్ అందజేత
కలెక్టరేట్, న్యూస్టుడే : కొవిడ్ విపత్కర పరిస్థితులున్నప్పుడు పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈ నెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. గత నెలలో పంపిణీ నిలిపివేసినా.. మే నెలలో ఇస్తారని అధికారులు చెప్పారు. ఈ నెల 20వ తేదీ వచ్చినప్పటికీ దీనిపై ఇప్పటికీ అధికారికంగా ఎటువంటి ఆదేశాలూ లేకపోవడంతో అసలు బియ్యం ఇస్తారా...?, ఇవ్వరా...?, అన్న అనుమానం పేదల్లో నెలకొంది.
5.71 లక్షల మంది ఎదురుచూపు
కొవిడ్ మొదటి దశ లాక్డౌన్ సందర్భంలో పేదలను ఆదుకునే ఉద్దేశంతో కేంద్రం బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ప్రధానమంత్రి గరీబ్ యోజన ద్వారా ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించింది. అప్పటి నుంచి పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ ఏడాది మార్చితో ఉచిత పథకం ముగియాల్సి ఉన్నప్పటికీ.. కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. కిలో రూపాయి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న బియ్యానికి ఇవి అదనం. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇచ్చేవారు. ఆ తర్వాత రేషన్ డిపోల ద్వారా కేంద్రం అందించే ఉచిత బియ్యాన్ని కార్డుదారులకు అందజేసేవారు. గత మార్చి వరకూ ఎటువంటి అవాంతరాలూ రాలేదు. ఏప్రిల్ నెలలో ఉచిత కోటా ఇవ్వలేదు. జిల్లాల విభజన నేపథ్యంలో కార్డుదారుల మ్యాపింగు, ఇతర సాంకేతిక కారణాలతో రాష్ట్ర వాటా రేషన్ పంపిణీలో కొన్ని రోజులు ఆలస్యమైంది. జిల్లాలో 5,71,703 బియ్యం కార్డులుండగా.. వీటికిగానూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సభ్యునికీ 5 కిలోల బియ్యం, రాయితీపై కందిపప్పు, పంచదార వంటి నిత్యావసరాలను అందజేస్తోంది. కార్డుదారులకు నెలకు 9,057 టన్నుల బియ్యం అవసరం. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం కూడా దాదాపు ఇదే పరిమాణంలో విడుదల చేయాలి. ప్రస్తుతం నెలలో మూడో వారం దాటిపోతున్నా ఇప్పటి వరకూ ఉచిత బియ్యం ఊసే లేదు. ఈ నెల కోటాకు సంబంధించి అసలు పంపిణీ ఉందా, లేదా అన్న విషయం కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు.
దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారి ఎ.పాపారావును వివరణ కోరగా ఈ నెల ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని తెలిపారు. వచ్చిన వెంటనే సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి