నారాయణ.. నారాయణ!
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది నారాయణపురం సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి. ఆనకట్ట ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరైనా పనుల్లో అడుగులు ముందుకు పడడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37,345
నత్తనడకన ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు
ఖరీఫ్ సాగునీటికి రైతుల అవస్థలు
సంతకవిటి, న్యూస్టుడే
నాగావళి నదిపై ఆనకట్ట
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది నారాయణపురం సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి. ఆనకట్ట ఆధునికీకరణకు జైకా నిధులు మంజూరైనా పనుల్లో అడుగులు ముందుకు పడడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 37,345 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగావళి నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట పనులు పూర్తికాక శివారు భూములకు అందని దుస్థితి ఏర్పడింది.
అస్తవ్యస్తంగా షట్టర్లు
ఖరీఫ్లో రెండు జిల్లాల పరిధిలోని సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని ఆయకట్టుకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీరు అందాలి. ఈ రెండు కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పలుచోట్ల గట్లు కోతకు గురవగా లైనింగ్ కొట్టుకుపోయింది. పూడిక పేరుకుపోయింది. సాగునీరు నిలవాలంటే ఆనకట్టపై ఉన్న 118 షట్టర్ల వ్యవస్థ కీలకం. ఇందులో సగం వరకు మరమ్మతులకు గురయ్యాయి. 10 వరకు షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. నీరు వృథాగా పోవడంతో శివారు గ్రామాలకు సాగునీరు ప్రశ్నార్థకమైంది. ఆనకట్ట, కాలువల ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నాలుగేళ్ల కిందట జైకా నిధులు రూ.112.10 కోట్లు మంజూరు చేసింది. 2019లో పనులు ప్రారంభించారు. 2020 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది. కరోనా, అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు 34 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో గడువు పెంచాలని అధికారులు మరోసారి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వచ్చే ఏడాదికి పూర్తి చేస్తాం..
- పి.సుధాకర్, ఎస్ఈ, నారాయణఫురం ప్రాజెక్టు
కొవిడ్ కారణంగా నారాయణపురం ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. కుడి, ఎడమ కాలువల్లో పూర్తిస్థాయిలో పూడికతీతతో పాటు, కొన్ని చోట్ల లైనింగ్ పనులు చేపట్టాం. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్