నెత్తురోడిన అడవి..!
దండకారణ్యం తుపాకీ తూటాలతో మరోసారి మారుమోగింది. పచ్చందాల అడవి నెత్తురొలికింది. బందూకుల మధ్య ప్రత్యక్ష పోరు కొనసాగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా
వెంకటాపురం మండలంలోని పామునూరు-జెల్ల ప్రాంతం ఈ ప్రదేశంలోనే ఎన్కౌంటర్ జరిగింది
దండకారణ్యం తుపాకీ తూటాలతో మరోసారి మారుమోగింది. పచ్చందాల అడవి నెత్తురొలికింది. బందూకుల మధ్య ప్రత్యక్ష పోరు కొనసాగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు సమీప కర్రిగుట్ట-ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఊసూరు ఠాణా సరిహద్దుల్లో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్ బలగాలకు చెందిన కానిస్టేబుల్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో మన్యం పల్లెల్లో వాతావరణం వేడెక్కింది.
ఈనాడు, డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, వెంకటాపురం, న్యూస్టుడే
కొనసాగుతున్న కూంబింగ్
జిల్లా సరిహద్దుల్లో పెద్ద ఘటన జరగడంతో ఏజెన్సీ ప్రాంతాలు భయంభయంగా గడుపుతున్నాయి. అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వాజేడు, మంగపేట, వెంకటాపురంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అటవీమార్గం గుండా లేదా రోడ్డు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే అవకాశం ఉండటంతో రహదారులపైనా పోలీసులు నిఘా పెట్టారు.
సంయుక్తంగా అడవుల్లోకి బలగాలు
ఛత్తీస్గఢ్ కీకారణ్యన్ని షెల్టర్ జోన్గా చేసుకుని మావోయిస్టులు తమ కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకత్వంతో పాటు జేఎండబ్ల్యూపీ (జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి), వెంకటాపురం-వాజేడు, ఏటూరునాగారం-మహదేవ్పూర్, గుండాల-నర్సంపేట, మహబూబాబాద్ ఏరియా కమిటీల దళాలు సంచరిస్తున్నట్లు ఎస్ఐబీ భావిస్తోంది. ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా వ్యూహాలు పన్నినట్లు తెలుస్తోంది. దండకారణ్యంలో మావోయిస్టు దళం సంచరిస్తుందనే పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు మూడు రోజుల కిందటే సర్కిల్ పోలీసుల సహకారంతో సంయుక్తంగా అడవుల్లోకి చొచ్చుకెళ్లాయి. వెంకటాపురం మండల కేంద్రానికి సుమారు 10 నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న కర్రిగుట్ట ప్రాంతంలో పాగా వేసి మావోయిస్టులపై ముప్పెటదాడి చేసినట్లు తెలుస్తోంది.
మూడు నెలల్లోనే మళ్లీ పేలిన తూటా
గతేడాది అక్టోబర్ 25న వాజేడు మండలం పెనుగోలుకు సమీపంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు పంజా విసిరాయి. ఈ ఘటనలో ఏరియా కమిటీ సభ్యుడితో సహ ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మూడు నెలలు గడవక ముందే తాజాగా మావోయిస్టుల షెల్టర్జోన్లో మళ్లీ తూటాల శబ్దం వినిపించింది.
సంఘటనా స్థలంలో దొరికిన తుపాకులు
దొరికినట్లే దొరికి తప్పించుకున్నారు..!
దండకారణ్యంలో కీలక మావోయిస్టు నేత ముచ్చాకి ఉంగాల్ అలియాస్ సుధాకర్ కేంద్రంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. పక్కా సమాచారంతో జరిగిన ఈ ఎన్కౌంటర్లో సుధాకర్పై గురి పెట్టినా దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి ఆయన ప్రస్తుతం జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ దళ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎన్కౌంటర్లో సుధాకర్ మృతి చెందినట్లు పోలీసులు భావించారు. ఈ క్రమంలో ప్రచార మాధ్యమాల్లోనూ విస్తృతంగా చక్కర్లు కొట్టింది. చివరికి ఘటన ప్రాంతం నుంచి తప్పించుకున్నట్లు భావిస్తున్నారు.
ఉదయం 6:00: ఎదురుకాల్పులు ప్రారంభం 8:00: సంఘటన వెలుగులోకి వచ్చింది 9:10: అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు 5:29 జిల్లా ఎస్పీ పేరుతో సంఘటనను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల
ఆగమేఘాలపై హైదరాబాద్కు..
ఉదయం 11.50 గాయపడిన కానిస్టేబుల్ మధును వెంకటాపురం హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లోకి ఎక్కించుకున్నారు.
12.32 హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంది
12.45 హెలికాప్టర్ వద్దకు వైద్య సిబ్బంది చేరుకున్నారు.
12.50 నుంచి 1.40 వరకు: అంబులెన్స్లో చికిత్స అందించారు.
1.45 మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు బయలుదేరారు.
వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి పర్యవేక్షణలో సెంట్రల్జోన్ డీసీపీ కె.పుష్పారెడ్డి, పలువురు పోలీసు అధికారులు పర్యవేక్షించారు.
-వరంగల్క్రైం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టి కప్పుతూ.. మాయ చేస్తూ..!
[ 04-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే.. దోచేస్తున్నా.. రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిన్నకుండి పోతున్నారు. -
ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉలికిపాటు!
[ 04-05-2024]
మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. పీపుల్స్వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టారు. -
ఓరుగల్లు వాసికి భారాస అవకాశం
[ 04-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏనుగుల రాకేశ్రెడ్డిని తమ అభ్యర్థిగా భారాస ప్రకటించింది. -
జాతీయ రహదారి.. అభివృద్ధికి మార్గసూచి!
[ 04-05-2024]
రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం కలిగిన జిల్లాల్లో ఖమ్మం తర్వాత ఉమ్మడి వరంగల్ ఉంటుంది. ఇవి వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 847.62 కి.మీ. విస్తరించాయి. -
రేపటి నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 5న ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష -2024 (నీట్)కు నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. -
ఓటు సామాజిక బాధ్యత
[ 04-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
‘కడియంది వెన్నుపోట్ల చరిత్ర’
[ 04-05-2024]
ఓటర్లు తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. -
వేసవి సెలవులు.. ఆటపాటలతో బాలానందం కొలువు
[ 04-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు బాలలు సిద్ధమయ్యారు. -
మట్టిని కొల్లగొడుతున్నారు!
[ 04-05-2024]
జిల్లా కేంద్రంలో మొరం, మట్టి వ్యాపారాన్ని కొందరు గుత్తేదారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా తయారు చేసి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
నోరు మెదపని వారిని లోక్సభకు పంపొద్దు: సీతారాంనాయక్
[ 04-05-2024]
నోరు మెదపని వారిని పార్లమెంట్కు పంపొద్దని భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ కోరారు. -
దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు
[ 04-05-2024]
వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు శుక్రవారం నుంచి ఇంటి వద్దనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. -
8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని లక్ష్మీపురంలో ఈ నెల 8న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భాజపా శ్రేణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు
[ 04-05-2024]
వరంగల్ జిల్లా ఖానాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. -
రూ.2తో ఓటు సవాలు
[ 04-05-2024]
కేవలం రూ.2లతో ఓటును సవాలు (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు..
[ 04-05-2024]
వ్యాపారి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వాలని బాధితుడు నిలదీస్తే ‘మాకు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు. -
ద్విచక్రవాహనంతో సహా బావిలో పడి ఒకరి మృతి
[ 04-05-2024]
రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్రవాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్