logo

ప్రధాని పర్యటన ప్రదర్శనలో పెంబర్తి కళాఖండం

జులై 3న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. అక్కడ నిర్వహించే ప్రదర్శనకు పెంబర్తి హస్త కళాఖండం ఎంపికైంది.

Published : 28 Jun 2022 06:16 IST


కళాకృతితో సోమనరసింహాచారి, అరవింద్‌ ఆర్య

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: జులై 3న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. అక్కడ నిర్వహించే ప్రదర్శనకు పెంబర్తి హస్త కళాఖండం ఎంపికైంది. తెలంగాణలో చేతి వృత్తులు, హస్త కళల నుంచి ఒక్కో విభాగం నుంచి ఒక్కొక్కటి ఎంపిక చేశారు. పెంబర్తి హస్తకళాకారుడు సోమనరసింహచారి రూపొందించిన కళాకృతి (జాతీయ సమైక్యతకు స్ఫూర్తిగా నిలిచే) ఎంపికైంది. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు అరవింద్‌ ఆర్య ప్రదర్శనలో పెట్టేందుకు కళాఖండాలు సేకరిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన పెంబర్తికి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని