logo

యుద్ధభేరి సభను జయప్రదం చేయాలి

కార్మిక చైతన్య మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరింయంలో నిర్వహించనున్న యుద్ధభేరి సభను జయప్రదం చేయాలని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు.

Updated : 31 May 2023 05:43 IST

నిట్ వద్ద ఆటో కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందితో వినయ్‌భాస్కర్‌

నిట్ క్యాంపస్‌, న్యూస్‌టుడే : కార్మిక చైతన్య మాసోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరింయంలో నిర్వహించనున్న యుద్ధభేరి సభను జయప్రదం చేయాలని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నిట్ కళాశాల గేటు వద్ద ఆటో కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం సరదాగా కొద్ది దూరం ఆటో నడిపారు.

ఆటో నడుపుతూ..

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని హనుమకొండ జిల్లా భారాస అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియంలో బుధవారం నిర్వహించనున్న కార్మిక యుద్ధభేరి సభను పురస్కరించుకొని మంగళవారం సభా ప్రాంగణంలో బెలూన్‌ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే సంకల్పంతో సీఎం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. సభకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు హాజరవుతారని, కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని