కొంగొత్తగా..అందమైన జ్ఞాపకం
వేడుకలేవైనా కలకాలం గుర్తుండిపోయేలా భద్రపరు చుకుంటోంది యువలోకం.. ఆ జ్ఞాపకాలు పదిలం చేసుకొనేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది
వేడుకలకు చిరునామాగా ఓరుగల్లు
వేడుకలేవైనా కలకాలం గుర్తుండిపోయేలా భద్రపరు చుకుంటోంది యువలోకం.. ఆ జ్ఞాపకాలు పదిలం చేసుకొనేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా పల్లె అందాల వైపు దృష్టి సారిస్తున్నారు. తమకు అనుకూలమైన బడ్జెట్లో ఈ జ్ఞాపకాల దొంతరలను ఫొటోషూట్ రూపంలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. కాదేది లోకేషన్కు అనర్హమన్నట్లు అడవి.. తండా.. పల్లె.. చెరువుగట్లు.. జలపాతాలు ఇలా ఉమ్మడి వరంగల్లోని ప్రకృతి అందాలన్నీ ఫొటోషూట్లకు వేదికలవుతున్నాయి.
హనుమకొండలోని కాకతీయ జంతు ప్రదర్శనశాల కూడా ప్రకృతి అందాల మధ్య మరుపురాని జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకొనేందుకు నెలవుగా మారింది. ప్రకృతి అందాలు కనువిందు చేసేలా ఫొటోలు తీసుకుని భద్రపరుచుకునేందుకు వేదికగా మారింది. పుట్టినరోజు, ప్రీ వెడ్డింగ్, శుభకార్యాలకు ఫొటో షూట్ చేసుకునేందుకు అనువుగా మారింది.
* ప్రతి ఫొటో షూట్కు కు రూ.1500 నిర్వాహకులకు చెల్లించాల్సి ఉంటుంది. గత ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 31, 2023వరకు 337 ఫొటో షూట్లు ఇక్కడ నిర్వహించుకున్నారు. దీని ద్వారా రూ.5.05 లక్షల ఆదాయం లభించిందని ఎఫ్ఆర్వో రాజు తెలిపారు.
న్యూస్టుడే, న్యూశాయంపేట
ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ కుటుంబీకులు ఇల్లంతా పూలతో అలంకరించి స్వాగతం పలుకుతున్న వేడుకలు ఇటీవల పల్లెల్లో సాధారణమయ్యాయి. కుంకుమ నీళ్లలో పాపాయి కాళ్లను పెట్టి ముద్రలను తెల్లటి వస్త్రం, కాగితంపై పెట్టించి వీడియోలు తీసి పదిలపరుచుకుంటున్నారు.
* పుట్టిన పాపాయికి ఏడాదిపాటు ప్రతి నెల పుట్టిన రోజు నిర్వహిస్తున్నారు. నెలకొక థీమ్తో ఏర్పాటు చేసి పక్కన చిన్నారుల ఫొటోలు తీసుకుంటున్నారు. ఇలా అందమైన జ్ఞాపకాలను మార్కెట్లో తక్కువ ఖర్చుతో లభించే వస్తువులతో ఇంటిని అలంకరిస్తున్నారు.
కొందరు యువకులు ఫొటో, వీడియో షూట్స్ చేసే ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా 25 థీమ్స్తో చిన్న ఫిల్మ్సిటీలను నెలకొల్పి అందుబాటులోకి తెచ్చారు. పలు రకాల సెట్టింగ్లతో నిర్మాణాలు చేపట్టారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఏడాది కిందట దీన్ని ప్రారంభించారు. ప్రీ, పోస్టు వెడ్డింగ్, మెటర్నిటీ, బేబీ షూట్స్ నిర్వహించేలా సౌకర్యాలు కల్పించారు. ఆరు గంటల షూట్కు రూ.16 వేలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నెలకు సుమారు 50 వరకు షూట్స్ జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.
గతంలో నగరాలకే పరిమితమైన ప్రీ, పోస్టు వెడ్డింగ్, మెటర్నిటీ, బేబీ షూట్స్, జన్మదిన వేడుకల నయా సంస్కృతి ప్రస్తుతం పల్లెలకూ పాకింది. ఎవరి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా జీవితంలో అందమైన జ్ఞాపకంగా గుర్తుండేలా చిత్రీకరించుకుంటున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా అదిరే అందమైన ప్రాంతాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నెలువైంది. వరంగల్ జూ పార్కు, లక్నవరం, భద్రకాళి బండ్ ఇలా అనేక షూటింగ్ ప్రదేశాలే కాకుండా పల్లెల్లోని ప్రకృతి వనాలు..చెరువు గట్లు.. పచ్చని పొలాలు అదిరే అందాలనిస్తున్నాయి. వీటికి తగినట్లుగా 25 థీమ్స్తో చిన్న ఫిల్మ్సిటీలను అందుబాటులోకి తెచ్చారు. ఫొటోలు తీసుకునే వారికి జ్ఞాపకాలు పదిలం చేసుకుని మురిసిపోవడం ఒక ఎత్తైతే.. షూటింగ్ స్పాట్ల ద్వారా ఆ ప్రాంతాలకు ఆదాయమూ లభిస్తోంది.
పల్లె అందాలతో..
ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయించుకోవాలంటే పెళ్లికి నెల రోజుల ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఖర్చుతో పాటు సమయం కూడా ఎక్కువ కేటాయించాల్సి వస్తోంది. బడ్జెట్ గురించి ఆలోచించే పేద, మధ్యతరగతి కుటుంబాలు షూటింగ్ కోసం తక్కువ ఖర్చుతో పాటు సమయం వృథా కాకుండా ఉండే ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. పల్లె ప్రకృతి వనాలు, చెరువు గట్లు, గుట్టలు, పచ్చని అటవీ ప్రాంతాలతో పాటు ఏజెన్సీలోని గుడిసెలను, పూరిళ్ల ప్రాంతాలను ఎంచుకుని షూటింగ్ చేయించుకుంటున్నారు.
న్యూస్టుడే, టేకుమట్ల(భూపాలపల్లి జిల్లా)
ఛార్జీలు ఇలా
గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న లోకేషన్లలో ఫొటోగ్రఫీ చేయించుకుంటే రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆల్బమ్ ఖర్చులు అదనం. థీమ్స్తో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఎనిమిది గంటలకు రూ.25 వేలు తీసుకుంటున్నారు. ఇతర ఖర్చులు రూ.30 వేలు అవుతున్నాయి. ఫొటో షూట్ చేయించుకుంటే రూ.15 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఛార్జీలు ఉన్నట్లు ఫొటోగ్రాఫర్లు చెబుతున్నారు. ఫోటో షూట్లో అధునాతన కెమెరాలు, పరికరాలు ఉపయోగిస్తున్నారు. కెమెరా, డ్రోన్, క్యాడిండ్ వీడియో, ఫొటోగ్రఫీ, సినిమాటెక్, అవుట్, ఇన్ డోర్ లైటింగ్ సిస్టమ్స్ను వినియోగిస్తున్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామ సమీపంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న లక్నవరం సరస్సు, దానిపై నిర్మించిన తీగల వంతెన, సరస్సు మధ్యలో ఉన్న ఐలాండ్ దీవిలో ప్రస్తుతం ప్రీవెడ్డింగ్, పుట్టిన రోజు వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. ఫొటోలు, వీడియోలు తీసుకునే వారు ముందస్తుగా రూ.5 వేలు చెల్లించి టికెట్ తీసుకోవాలి. ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ షూట్స్ జరుగుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
న్యూస్టుడే, గోవిందరావుపేట
పరిసరాల్లోనే షూట్ చేయించుకున్నాం
- నూకల శ్రీకాంత్, టేకుమట్ల
గతనెల 7న వివాహం జరిగింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం దూరప్రాంతాలకు వెళ్లలేకపోయాం. సమయం కూడా తక్కువగా ఉంది. మండలంలోని పరిసర గ్రామాల్లోని అందాలను గుర్తించి అక్కడికి వెళ్లి ఫొటో షూట్ చేయించుకున్నాం. ఖర్చుతో పాటు సమయం వృథా కాకుండా ఆదా చేసుకున్నాం.
వినియోగదారులకు ఇష్టమైన రీతిలో
- సతీష్, ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
25 ఏళ్లుగా ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. ఒకప్పుడు మేము చెప్పినట్లుగా వినియోగదారులు విని ఫొటో తీయించుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వారికి నచ్చినట్లుగా ఫొటోలు తీయాల్సి వస్తోంది. షూటింగ్ స్పాట్లు కూడా వారు చెప్పిన చోటికే వెళ్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.