పాఠశాలలో మద్యం తాగిన విద్యార్థులు.. టీచర్ను ఇరికించే ప్రయత్నం విఫలం
ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థుల అసాంఘిక వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.
ములుగు, న్యూస్టుడే: ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థుల అసాంఘిక వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలో మద్యం తాగుతూ దొరికిపోగా ఉపాధ్యాయుడిపై నింద మోపేందుకు ప్రయత్నించి ఇరుకున పడ్డారు. విద్యార్థులు మద్యం తాగింది వాస్తవమేనని విచారణలో తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఏమీ మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకొచ్చి తాగారు. గమనించిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించారు. మరో సారి ఇలాంటి పని చేయమని వారితో ఒప్పంద పత్రం రాయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం చెప్పా పెట్టకుండా విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. వ్యాయామ ఉపాధ్యాయుడే మద్యం తాగి తాము తాగినట్లు ఒప్పంద పత్రం రాయించుకున్నాడని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల మాటలు నమ్మిన తల్లిదండ్రులు మరుసటి రోజు పాఠశాలకు వచ్చి వ్యాయామ ఉపాధ్యాయుడితో పాటు మరి కొంత మంది ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కో-ఆర్డినేటర్ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామి పాఠశాలకు వెళ్లి విచారణ జరపగా వాస్తవాలు వెలుగు చూశాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఏడుగురు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇద్దరు మద్యం తాగారని తేలింది. వీరిలో ఎక్కువ మంది ఏటూరునాగారం మండలానికి చెందిన వారుగా సమాచారం. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాలేదు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం
- అంకయ్య, ప్రిన్సిపల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మల్లంపల్లి
విద్యార్థులు మద్యం తాగిన అంశంపై వరంగల్ రీజినల్ కో-ఆర్డినేటర్ వచ్చి మంగళవారం విచారణ జరిపింది వాస్తవమే. ఇప్పటి వరకు విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీసీలు జారీ చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
మద్యం దుకాణ యజమానిపై కేసు నమోదు
- సుధీర్ కుమార్, ఎక్సైజ్ సీఐ, ములుగు
విద్యార్థులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లి శ్రీరామ వైన్స్పై కేసు నమోదు చేశాం. శనివారం రాత్రి విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా తేలింది. 21 సంవత్సరాల లోపు వారికి మద్యం విక్రయించినందుకు దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి కమిషనర్కు నివేదిక పింపించాం. కమిషనర్ ఆదేశాల మేరకు జరిమానా విధిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్