సమయం విలువ తెలుసుకో.. కాలంతో సాగిపో
24 గంటలు అంటే.. ఒక్క రోజులో ఏం చేయగలం.. తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. హనుమకొండలోని ప్రధాన గ్రంథాలయం, రామన్నపేటలోని స్మార్ట్ లైబ్రరీతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు
ఆగస్టు 23.. సాయంత్రం 6.04 గంటలు
ఇస్రో శాస్త్రవేత్తలు ముందే ప్రకటించినట్లు విక్రమ్ ల్యాండర్ చందమామపై దిగిన సమయం.
‘ఒక్క సెకను ఆలస్యమైతే క్రీడాకారులు పతకాన్ని ముద్దాడలేరు..నిమిషం వెనకబడినా విద్యార్థుల భవితవ్యం తలకిందులవుతుంది..ఓ రోగిని అడిగితే చెబుతాడు చికిత్స గంట జాప్యమైతే కలిగే బాధ ఏంటని..గడువులోపు కావాల్సిన ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పూర్తి కాకపోతే రూ.కోట్ల ప్రజాధనం వృథా..
గంటలు.. నిమిషాలే కాదు సెకన్లతో సహా అన్ని దశల్లో సమయపాలన పాటించడం వల్లే చంద్రయాన్-3 విజయం సాధ్యమైంది. సమాజంలో సమయపాలన పాటించని వాళ్లెందరో.. సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు.. ఇలా అన్ని దశల్లో ఆలస్యం చేయడంతో దాని వల్ల అనేక దుష్పరిణామాలు కలుగుతుంటాయి. ఈ క్రమంలో కాలం విలువ తెలుసుకొని ముందుకు సాగితే ఎంతో సాధించవచ్చని చంద్రయాన్- 3 విజయం ద్వారా తెలుసుకోవచ్చు. ఆలస్యం అమృతం విషం’ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ విషయం తెలిసినవాళ్లు జీవితంలో అద్భుత విజయాలు సాధిస్తారు.
ఒక్క రోజూ వృథా చేయొద్దు
24 గంటలు అంటే.. ఒక్క రోజులో ఏం చేయగలం.. తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. హనుమకొండలోని ప్రధాన గ్రంథాలయం, రామన్నపేటలోని స్మార్ట్ లైబ్రరీతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా, బద్ధకాన్ని వీడి చదివితే కచ్చితంగా విజయం దరిచేరుతుంది. ఒక్కరోజులో చదివిన పాఠ్యాంశాల నుంచి రెండు బిట్లు వస్తే చాలు మేటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఉద్యోగ సాధనలో ఒక్క రోజు కూడా వృథా చేయొద్దు. అలాగే ప్రతి నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది.
హనుమకొండ గ్రంథాలయంలో పరీక్షలకు సిద్ధమవుతున్న యువత
సెకను..తారుమారు చేస్తుంది..
ఒక్క సెకను.. క్రీడాకారులు, దేహదారుఢ్య పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఎంతో కీలకం. రెండు, మూడు సెకన్లు ముందు వచ్చిన అభ్యర్థులు నెగ్గుతారు. వెనకబడ్డ వారు ఓడిపోతారు. క్రీడాకారులు, పోలీసు, సైనిక దేహదారుఢ్య పరీక్షల అభ్యర్థుల భవితవ్యం సెకన్ల తేడాలోనే ఉంటుందని చెప్పడానికి ఇటీవల జరిగిన సంఘటనలు ఉదాహరణ
ః గతేడాది డిసెంబరు, ఈ ఏడాది ఫిబ్రవరిలో కేయూ మైదానంలో పోలీసులు ఎంపిక ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఇందులో ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 24 వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వీరిలో 17 వేల మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. గమ్యం చేరుకోవడంలో సెకన్ల తేడాతో ఆలస్యమై వేలాది మంది అర్హత సాధించలేదు. 2021లో హనుమకొండ జేఎన్ఎస్లో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. అందులో విజేతలు అందరికన్నా సెకన్ల ముందు పరుగెత్తి మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. అందుకే ప్రతి సెకను ఎంతో విలువైనదిగా భావించి శ్రమిస్తే విజయం సొంతమవుతుంది.
గంటలు.. నిర్లక్ష్యానికి తప్పదు మూల్యం
ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు చేయాలి. మన దగ్గర అనేక మంది ఉద్యోగులు, ప్రభుత్వ వైద్యులు గంటల తరబడి ఆలస్యంగా విధులకు వస్తున్నారు.
ఉదాహరణకు గురువారం హనుమకొండ కలెక్టరేట్కు వెళ్లి ఖజానా కార్యాలయంలో ‘ఈనాడు’ పరిశీలిస్తే.. ఉదయం పదిన్నర లోపు రావాల్సిన ఉద్యోగి 11 గంటల వరకు కూడా విధులకు రాలేదు. పింఛన్లు, ఇతర అవసరాల కోసం కార్యాలయాలకు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వరంగల్ ఎంజీఎంలో సైతం ఇదే పరిస్థితి. ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యుల్లో కొందరు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నట్లు రోగులు వాపోతున్నారు.
అద్భుతాలకు అదే కీలకం..
ఆచార్య లక్ష్మారెడ్డి, విశ్రాంత అధ్యాపకుడు, నిట్
చంద్రయాన్ 3 ప్రయోగంలో ప్రతి దశ సమయంతో ముడిపడి ఉన్నదే. మిల్లీ సెకన్లను కూడా పరిగణించే అణు గడియారాలను ఉపయోగించి సమయాన్ని లెక్కిస్తారు. సమయపాలన పాటిస్తే అద్భుత ఆవిష్కరణలు మన సొంతం అవుతాయి.
‘చంద్రయాన్’ నేర్పుతున్న పాఠం
ప్రతి నిమిషం.. విద్యార్థులకు కీలకం
ఒక్క నిమిషమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జీవితమే అంధకారం అవుతుంది. విద్యార్థులు ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి శ్రమించాలి. సమయపాలన పాటించడం చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. పోటీ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా నిర్వాహకులు లోనికి అనుమతించరు. సంవత్సరమంతా కష్టపడి చదివింది వృథా అవుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్లో పది, ఇంటర్, ఎంసెట్, జేఈఈ లాంటి అనేక రకాల పరీక్షలకు చివర్లో హడావుడిగా పరుగెత్తుకొచ్చినా నిమిషం ఆలస్యంతో దూరమైన వారు ఉన్నారు. ఎంత ప్రాధేయపడినా అమతించని సందర్భాలు అనేకం చూశాం. సమయపాలన ప్రాధాన్యాన్ని చిన్నప్పటి నుంచే విదార్థులకు తెలియజేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి గురించి వివరించాలి.
ఏళ్లు.. జాప్యమైతే అభివృద్ధి ఆగదా!
ప్రభుత్వం గడువు లోపు పూర్తి చేయాల్సిన అనేక ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆలస్యమైనా పట్టించుకునే నాథుడే లేరు. దీంతో అభివృద్ధి నిలిచిపోతుంది. ః ఉదాహరణకు వరంగల్ మెగా జౌళిపార్కు నిర్మాణానికి 2017 అక్టోబరులో శంకుస్థాపన చేశారు. ఏడాదిలో పూర్తి చేయాలని గడువు విధించారు. ఆరేళ్లయినా అనుకున్న స్థాయిలో సాకారం కాలేదు. ఇదొక్కటే కాదు.. కాళోజీ కళాక్షేత్రం పనులు మొదలుపెట్టి 8 ఏళ్లు గడచినా పూర్తి కాలేదు. హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణమండపం 18 ఏళ్ల కిందట మొదలైనా ఇంకా పూర్తికాలేదు. దీంతో అంచనాలు రూ. కోట్లలో పెరిగిపోయి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ