Dalit Bandhu: ‘పుస్తెల తాడు అమ్మి డబ్బులిచ్చినా.. అందని దళితబంధు!’
కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తున్న మాకు దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు వర్తింపజేయడానికి అధికార పార్టీ నాయకులు డబ్బులు అడిగారని.. దీంతో రూ.లక్ష వరకు అప్పు తెచ్చి ఇచ్చామని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలకేంద్రానికి చెందిన 35 మంది దళిత మహిళలు తెలిపారు
బంగారు పుస్తెలు అమ్మి పసుపు తాడు ధరించినట్లు చూపుతున్న మహిళ
వెంకటాపూర్, న్యూస్టుడే: కాయకష్టం చేసి కాలం వెళ్లదీస్తున్న మాకు దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు వర్తింపజేయడానికి అధికార పార్టీ నాయకులు డబ్బులు అడిగారని.. దీంతో రూ.లక్ష వరకు అప్పు తెచ్చి ఇచ్చామని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలకేంద్రానికి చెందిన 35 మంది దళిత మహిళలు తెలిపారు. వీరిలో ఒక మహిళ తాను పుస్తెలతాడు అమ్మి ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆ నాయకులు ముఖం చాటేశారని ఆరోపిస్తూ సోమవారం స్థానిక తాళ్లపహాడ్ జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు స్థానిక గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు స్వార్థపూరితంగా అధికార బలం చూపించుకుని అర్హులకు అన్యాయం చేశారన్నారు. ఇక్కడ నిలిపివేసినా.. ఎక్కడికైనా వెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. దళిత బంధు రాకపోతే గృహలక్ష్మి వస్తుందని, అదికూడా రాకపోతే రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని నమ్మజెప్పి మోసం చేసిన నాయకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అర్హులైన మాకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. సుమారు గంటపాటు నిరసనతో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి రాకపోకలను పునరుద్ధరించారు. నిరసనలో వార్డు సభ్యులు బోడ తులసమ్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు కాడపాక శ్యాం, గడ్డమీది రమ్య, అల్లంకొండ కుమార్, గడ్డం రమేష్, మొలంగూరి మహేందర్, అశోక్, రజిత, రాజు, జంపయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్