మది నిండా ప్రగతి ఆలోచనలే..!
ఆయన 99వ సంవత్సరంలోకి అడుగిడిన రాజకీయ కురువృద్ధుడు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న నేత.
మానుకోట, కురవి, న్యూస్టుడే
ఆయన 99వ సంవత్సరంలోకి అడుగిడిన రాజకీయ కురువృద్ధుడు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న నేత. ఆయనే మహబూబాబాద్ జిల్లా సీరోలుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు మాజీ ఎమ్మెల్సీ వెడవెల్లి వెంకటరెడ్డి. గాదె వెంకటరెడ్డిగా సుపరిచితులు..
నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కొన్నేళ్లు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. పలుమార్లు రజాకార్ల దాడుల నుంచి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దేశ స్వాతంత్య్రం కోసం గ్రామాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. వెంకటరెడ్డిది నిరాడంబర జీవితం. హైదరాబాద్లో ఉండే కుమారులు తమ వద్ద ఉండాలని కోరినా సొంత గ్రామంలోనే నివసించడం ఆయనకు ఇష్టం.
ప్రముఖులకు ఎన్నికల ఏజెంటుగా..
1962లో ఎన్నికల ప్రచారానికి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వరంగల్కు వస్తే మామునూరు విమానాశ్రయంలో ఆయనను వెంకటరెడ్డి ఆహ్వానించారు. అప్పుడు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు. మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. చెన్నారెడ్డి సనత్నగర్ ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అలాగే రామచంద్రారెడ్డి డోర్నకల్ నుంచి పోటీ చేసినప్పుడు వారికి ఎన్నికల ఏజెంటుగా పనిచేశారు.
కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేసేవారు..
‘అప్పటి రాజకీయ విలువలు నేడు లేవు. ఎన్నికల సమయంలో డబ్బు వ్యయం చాలా తక్కువ, మద్యం ప్రభావం లేదు. పార్టీ కార్యకర్తలు ఎవరికి వారే సొంత డబ్బులే పెట్టుకుని పనిచేసేది. టిఫిన్కు ఖర్చు ఇచ్చినా తీసుకు¸నేవారు కాదు. ‘పైసలొద్దు.. మాకు ఏమైనా పనిపడితే చేయండి’ అనేవారు.. అప్పటి మర్యాదలే వేరు. త్యాగబుద్ధి ఉండేది. ప్రజానాయకులకు నైతిక విలువలు, సేవా దృక్పథం అవసరం. వీటిని పాటించే నేతలకు తక్షణ గుర్తింపు రాకున్నా క్రమంగా సమాజంలో ఆదరణ పెరుగుతుంది.’ అని చెబుతున్నారు.
30వ తేదీన ఓటేస్తా..
వెంకటరెడ్డి 1952 నుంచి స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్సభ ఇలా ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటానని ఆయన ‘న్యూస్టుడే’తో చెప్పారు.
నిర్వ హించిన పదవులు
1950-52లో మహబూబాబాద్ తాలూకా కాంగ్రెస్ కార్యదర్శి. 1953లో తాలూకా సివిల్ సప్లయి శాఖ సభ్యుడు. 1962 నుంచి 1968 వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. 1964లో సీరోలు సర్పంచిగా ఏకగ్రీవ ఎన్నిక. 1970 నుంచి 1978 వరకు మహబూబాబాద్ వ్యవసాయ సహకార అభివృద్ధి బ్యాంకు కమిటీ సభ్యుడు. 1974 నుంచి 80 వరకు వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు.
నేటికీ తన ఊరు అభివృద్ధి పైనే ధ్యాస
ఈ వృద్ధాప్యంలోనూ జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న తన సొంత గ్రామం సీరోలు అభివృద్ధే ఆయన నిత్య ఆలోచనగా ఉంటుంది. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనా శ్రద్ధ చూపుతారు. తన ఇంటికి వచ్చే ప్రజలు, నేతలు, అభిమానులతో గ్రామంలో ఇంకా ఎలాంటి సౌకర్యాలు అవసరమో చర్చిస్తారు. ప్రభుత్వ అధికారులకు ఎప్పటికప్పుడూ సమస్యలు తెలియజేస్తారు. ఆయన కృషి వల్ల ఏకలవ్య పాఠశాల ఏర్పాటైంది. సీరోలు మండల కేంద్రం కావాలని ఆయన బాగా కోరుకునేవారు. తాజాగా నెరవేరడంతో చాలా ఆనందంగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్