మూడుసార్లు ఎమ్మెల్యే.. తిరిగింది రిక్షాలోనే
ఈరోజుల్లో డివిజన్ కార్పొరేటర్ అయితే చాలు విలాసవంతమైన వాహనం, వ్యక్తిగత సహాయకుడు, ఎక్కడికెళ్లిన ప్రొటోకాల్ హంగామా ఉంటుంది.
ఆదర్శ నేత నాగభూషణ్రావు
కార్పొరేషన్, న్యూస్టుడే : ఈరోజుల్లో డివిజన్ కార్పొరేటర్ అయితే చాలు విలాసవంతమైన వాహనం, వ్యక్తిగత సహాయకుడు, ఎక్కడికెళ్లిన ప్రొటోకాల్ హంగామా ఉంటుంది. కానీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు సొంత వాహనం లేదు. నగరంలో ఎక్కడికెళ్లినా రిక్షాలోనే ప్రయాణం. శాసనసభకు వెళ్లాలంటే రైలు లేదా ఆర్టీసీ బస్సులోనే. ఇది దివంగత నేత బండారు నాగభూషణ్రావు ఆదర్శం.
ఇదీ నేపథ్యం..: వరంగల్ నగరంలోని కృష్ణకాలనీకి చెందిన బండారు నాగభూషన్రావు స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా పనిచేసి జైలుకెళ్లారు. ఉన్నత విద్యావంతులు కూడా. అప్పట్లోనే డబుల్ పీజీ, బీఎడ్ చేసిన ఆయన 1961 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేశారు. శషిరేఖను ఆదర్శ వివాహం చేసుకున్నారు. సంతానం కలగక పోవడంతో సమీప బంధువు అయిన ఫణిభూషణ్రావును దత్తత తీసుకున్నారు. అజంజాహి మిల్లు కార్మిక సంఘం నాయకుడిగా దీర్ఘకాలం పనిచేశారు. ఈయనకు కార్మిక బంధు అన్న పేరుకూడా ఉంది. కార్మిక సంఘం నాయకుడిగా.. అప్పట్లో ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రామారావుతో మాట్లాడి అజంజాహి మిల్లు (ఏజే మిల్లు)లో ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయించారు.
రాజకీయ ప్రస్థానం..: అజంజాహీ మిల్లు కార్మిక నేతగా పేరున్న నాగభూషణ్రావు తొలిసారిగా వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 1962లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి మిర్జాబేగ్పై విజయం సాధించారు.
- 1967లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థ టీఎస్.మూర్తి చేతిలో ఓడిపోయారు. కార్మికుల్లో ఆయనకున్న పేరును చూసి తెదేపా అధినేత ఎన్టీ రామారావు పట్టుబట్టి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెదేపా తరఫున 1983లో భూపతి కృష్ణమూర్తి (భాజపా)పై, 1985 ఎన్నికల్లో అబ్దుల్ ఖాదర్(కాంగ్రెస్)పై గెలుపొందారు.
- వరంగల్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకులు పలు చర్యలు తీసుకున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండుల్లో జేబు దొంగలను గుర్తించి.. వారితో మాట్లాడి, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారనే పేరుంది.
సాధారణ జీవితం..: మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నాగభూషణ్రావు సాధారణ జీవితం గడిపారు. సొంత వాహనం కూడా లేకపోయింది. హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు, ఇతర ముఖ్యమైన సమావేశాలకు రైలు లేదా ఆర్టీసీ బస్సులో వెళ్లే వారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఏదైనా పని కోసం హైదరాబాద్కు వస్తే దగ్గరుండి చేయించే వారు.
- 1984లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఏర్పడింది. తొలి ఛైర్మన్గా బండారు నాగభూషణ్రావు పనిచేశారు.
- రంగశాయిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హంటర్రోడ్ చిన్న వంతెన, ఉర్సు ప్రసూతి ఆసుపత్రిని ఆయనే మంజూరు చేయించినట్లు తెదేపా కార్యకర్తలు చెబుతుంటారు.
- 2000 సంవత్సరంలో వరంగల్లోనే మృతి చెందారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!