ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది.
మానుకోట, న్యూస్టుడే: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లాలో ప్రథమ సంవత్సరం 55.72 శాతంతో రాష్ట్రంలో 17వ స్థానం పొందింది. బాలురు 41.87, బాలికలు 66.44 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 65.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 17వ స్థానంలోనే నిలిచింది. బాలురు 52.94, బాలికలు 75.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. వృత్తి విద్య ఉత్తీర్ణతలోనూ బాలికలే పైచేయిగా ఉన్నారు. వృత్తి విద్య ప్రథమ సంవత్సరంలో జిల్లా 45.9 శాతం ఉత్తీర్ణతను పొంది రాష్ట్రంలో 28వ స్థానం పొందింది. బాలురు 21.51, బాలికలు 65.21 శాతం అలాగే ద్వితీయ సంవత్సర వృత్తి విద్యలో జిల్లా 56.49 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. బాలురు 31.08, బాలికలు 75.64 శాతం ఉత్తీర్ణతను సాధించారు. గంగారం మండలం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం(కేజీబీవీ) విద్యార్థినులు వరసగా రెండో సంవత్సరం వందశాతం ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచింది.
ఒక మెట్టు పైకి..
గత విద్యా సంవత్సరం (2022-23) జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 64 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచారు. ఈ విద్యాసంవత్సరంలో (2023-24) 65.14 ఉత్తీర్ణతతో 17వ స్థానంలో పొందారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో గత సంవత్సరం 53 శాతం ఉత్తీర్ణతతో 22వ స్థానంలో ఉంటే ఈసారి 55.72 శాతంతో 17వ స్థానంలో మెరుగ్గా నిలిచింది. వృత్తివిద్య ఫలితాల్లో గత సంవత్సరం కంటే వెనకబడింది. 2023లో వృత్తివిద్యలో ప్రథమ సంవత్సర ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 27వ స్థానంలో ఉండగా ఈసారి 28, ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణతలో గత ఏడాది 26వ స్థానంలో ఉండగా ఈసారి 30వ స్థానానికి పడిపోయింది.
కారణాలేమిటి..?
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ప్రత్యేక అధ్యయన తరగతులు, లఘు పరీక్షల నిర్వహణలాంటి చర్యలను చేపడుతున్నారు. అధ్యాపకుల కొరత కూడా ఇటీవల చాలా వరకు తగ్గింది. కళాశాలల్లో సౌకర్యాలు కూడా కొంతమేరకు పెరిగాయి. ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉండడం లేదు. కొవిడ్ కాలంలో తరగతులు జరగక ప్రధానంగా పాఠశాల విద్యపై దాని ప్రభావం పడడం పర్యవసానంగా ఆ తర్వాత కాలంలో ఇంటర్మీడియట్ విద్యపై కూడా ఆ ప్రభావం చూపడం కొందరు కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ్యంగా బాలురు సరిగా తరగతులకు హాజరుకావడం లేదని ఇతర జీవనోపాధి పనులకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేస్తే గైర్హాజరు పరిస్థితి తగ్గుతుందనే భావన వ్యక్తం అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టి కప్పుతూ.. మాయ చేస్తూ..!
[ 04-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే.. దోచేస్తున్నా.. రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిన్నకుండి పోతున్నారు. -
ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉలికిపాటు!
[ 04-05-2024]
మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. పీపుల్స్వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టారు. -
ఓరుగల్లు వాసికి భారాస అవకాశం
[ 04-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏనుగుల రాకేశ్రెడ్డిని తమ అభ్యర్థిగా భారాస ప్రకటించింది. -
జాతీయ రహదారి.. అభివృద్ధికి మార్గసూచి!
[ 04-05-2024]
రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం కలిగిన జిల్లాల్లో ఖమ్మం తర్వాత ఉమ్మడి వరంగల్ ఉంటుంది. ఇవి వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 847.62 కి.మీ. విస్తరించాయి. -
రేపటి నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 5న ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష -2024 (నీట్)కు నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. -
ఓటు సామాజిక బాధ్యత
[ 04-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
‘కడియంది వెన్నుపోట్ల చరిత్ర’
[ 04-05-2024]
ఓటర్లు తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. -
వేసవి సెలవులు.. ఆటపాటలతో బాలానందం కొలువు
[ 04-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు బాలలు సిద్ధమయ్యారు. -
మట్టిని కొల్లగొడుతున్నారు!
[ 04-05-2024]
జిల్లా కేంద్రంలో మొరం, మట్టి వ్యాపారాన్ని కొందరు గుత్తేదారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా తయారు చేసి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
నోరు మెదపని వారిని లోక్సభకు పంపొద్దు: సీతారాంనాయక్
[ 04-05-2024]
నోరు మెదపని వారిని పార్లమెంట్కు పంపొద్దని భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ కోరారు. -
దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు
[ 04-05-2024]
వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు శుక్రవారం నుంచి ఇంటి వద్దనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. -
8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని లక్ష్మీపురంలో ఈ నెల 8న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భాజపా శ్రేణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు
[ 04-05-2024]
వరంగల్ జిల్లా ఖానాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. -
రూ.2తో ఓటు సవాలు
[ 04-05-2024]
కేవలం రూ.2లతో ఓటును సవాలు (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు..
[ 04-05-2024]
వ్యాపారి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వాలని బాధితుడు నిలదీస్తే ‘మాకు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు. -
ద్విచక్రవాహనంతో సహా బావిలో పడి ఒకరి మృతి
[ 04-05-2024]
రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్రవాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!