logo

ఎట్టకేలకు తారు పడింది..!

వెంకటాపురం మండలంలోని రాచపల్లి-మొట్లగూడెం రహదారికి ఎట్టకేలకు తారు పడింది. రూ.1.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గం ఏడాదిగా అసంపూర్తిగానే వెక్కిరించింది.

Updated : 06 May 2024 06:39 IST

వెంకటాపురం, న్యూస్‌టుడే: వెంకటాపురం మండలంలోని రాచపల్లి-మొట్లగూడెం రహదారికి ఎట్టకేలకు తారు పడింది. రూ.1.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గం ఏడాదిగా అసంపూర్తిగానే వెక్కిరించింది. ఈ సమస్యపై ‘ఈనాడు’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. మార్చి 31 తేదీన ‘కంకర పరిచి.. తారు మరిచి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ అధికారులు స్పందించారు. రెండు రోజుల కిందట గుత్తేదారు 1.20 కి.మీ పరిధికి చెందిన ఈ మార్గంపై తారు వేశారు. దశాబ్ధాలుగా బురొద రోడ్డుపైనే అవస్థలు పడే గిరిజనానికి ఇన్నాళ్లకు తారు రహదారి చేరువ కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని