బడుల ప్రారంభం రోజే.. పుస్తకాల పంపిణీ
విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది.
జిల్లా గోదాంలో నిల్వచేసిన పాఠ్యపుస్తకాలు
న్యూస్టుడే, భూపాలపల్లి : విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది.. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గోదాంలో నిల్వ చేసిన పుస్తకాలను మొత్తం 11 మండలాలకు సరఫరా చేసేందుకు విద్యాశాఖ అధికారులు టెండర్లు నిర్వహించి, వాహనాల్లో సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 13,240 పుస్తకాలు జిల్లా గోదాంకు ఆదివారం చేరినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 27,340 మంది విద్యార్థులు చదువుతున్నారు.
10 శాతం పుస్తకాలు : జిల్లాలో విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు కేవలం 10 శాతం మాత్రమే వచ్చాయి. ఇంకా 90 శాతం రావాల్సి ఉంది. వాస్తవానికి 2,17,475 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 13,240 పుస్తకాలు మాత్రమే జిల్లా గోదాంకు చేరాయి. గతేడాదికి సంబంధించిన పుస్తకాలు 2,265 ఉన్నాయి. మిగతా 2,01,970 పుస్తకాలు ఈ నెల 15వ తేదీలోగా జిల్లాకు చేరనున్నాయి. గత విద్యా సంవత్సరం నవంబరు నెలాఖరు వరకు సరఫరా కొనసాగింది. పుస్తకాల విషయంలో ఈ విద్యా సంవత్సరం అధికారులు చాలా వరకు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కృషి చేస్తున్నారు.
ద్విభాష మాధ్యమంలో.. : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లంలో ముద్రణ ఉంటుంది. తెలుగు మాధ్యమం నుంచి, ఆంగ్లంలో సులువుగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇలా ముద్రించారు. ఈ విధానంలో గత రెండేళ్ల నుంచి 3 నుంచి 9వ తరగతి వరకు ముద్రించారు. ఈ సారి 10వ తరగతి వరకు అమలవుతోంది. దీనికి ‘క్యూ ఆర్కోడ్’ ఉంటుంది. ఈ సారి పుస్తకాల వరస సంఖ్యను ముద్రించారు. అవి పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే.. సులువుగా గుర్తించేలా ప్రభుత్వ స్టిక్కర్ ఉంటుంది.
అన్ని మండలాలకు పంపిస్తాం
- రాంకుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ బడులు ప్రారంభం రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జంగేడు గోదాంలో నిల్వచేస్తున్నాం. మొత్తం పుస్తకాలను వచ్చిన తర్వాతనే అన్ని మండలాలకు పంపిస్తాం. ఎంఈవోలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM