పేద కుటుంబాల్లో మద్యం చిచ్చు!
‘అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం. స్టార్ హోటళ్లలో మినహా ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తాం. అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని నిషేధిస్తాం’
నిషేధం ఊసే మరిచిన ప్రభుత్వం
- తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవ పడేవాడు. పిల్లలు ఆడుకునే విషయమై మద్యం మత్తులో భార్యతో గొడవపడి చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరేసుకుని మృతి చెందారు. దీంతో పదేళ్లు కూడా నిండని ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు.
- భీమవరం బైపాస్ రోడ్డులో ఇటీవల రాత్రివేళ కొందరు యువకులు మద్యం తాగి ఒకరిపై ఒకరు ఖాళీ సీసాలతో దాడి చేసుకోవడంతో గాయాలయ్యాయి. ఎంతో భవిష్యత్తును చూడాల్సిన యువతపై కేసులు నమోదయ్యాయి.
ఈనాడు డిజిటల్, భీమవరం, పట్టణం, న్యూస్టుడే: ‘అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం. స్టార్ హోటళ్లలో మినహా ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తాం. అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని నిషేధిస్తాం’ - సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన ఇది. తీరా అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించకపోగా విక్రయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తొలుత దుకాణాల సంఖ్యను తగ్గించి ధరలను పెంచడంతో ఖజానాకు రాబడి తగ్గింది. దీంతో ధరలను తగ్గించి విక్రయాలు పెంచుకున్నారు. మద్యం కారణంగా పచ్చని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నా.. మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తగ్గిన దుకాణాలు 19 మాత్రమే.. వైకాపా అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబరులో నూతన మద్యం పాలసీని ప్రకటించింది. 2020 మార్చి తర్వాత మొదటి విడతలో 25 శాతం దుకాణాలు తగ్గించారు. 2020 అక్టోబరులో రెండోసారి, తాజాగా మూడోసారి మద్యం పాలసీని ప్రకటించినా షాపులు తగ్గలేదు. దీనికి తోడు వాకిన్ స్టోర్స్, పర్యాటక ప్రాంతాల్లో మాల్స్ పేరిట మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ లెక్కన మొత్తానికి తగ్గిన దుకాణాల సంఖ్య 19 మాత్రమే.
ఇదీ పరిస్థితి.. పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో 210 మద్యం దుకాణాలుంటే ప్రస్తుతం 191 ఉన్నాయి. ఏటా 25 శాతం దుకాణాలను తగ్గించి నాలుగేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. గత నాలుగేళ్లలో పరిస్థితులను పరిశీలిస్తే రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే వారి సంపాదనలో పెద్దగా మార్పులేదు. కానీ పేదలు మద్యానికి వెచ్చించే ఖర్చు రెండింతలైంది. నాసిరకం మందు విక్రయించడంతో ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. కష్టపడి సంపాదించిందంతా మద్యానికి, ఆసుపత్రులకే అయిపోతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో గతేడాది నమోదైన కేసులు
మద్యం అక్రమ రవాణా 73
అక్రమ విక్రయాల్లో అరెస్టయిన వారు 167
డ్రంక్ అండ్ డ్రైవ్ 1,890
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం 16,731
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్