ఆటో బోల్తా.. ఇద్దరి మృతి
పొట్టకూటి కోసం పనుల నిమిత్తం వెళుతున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది.
మరో 19 మందికి గాయాలు
వీర్ల కృష్ణకుమారి, సుజాత (పాతచిత్రాలు)
ఆగిరిపల్లి, గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే : పొట్టకూటి కోసం పనుల నిమిత్తం వెళుతున్న ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆగిరిపల్లి మండలం చిన్నఆగిరిపల్లి శివారు గొల్లగూడేనికి చెందిన 22 మంది మహిళలు కూలి(పత్తితీత) పనులకు ఆటోలో కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లికి వస్తున్నారు. మార్గంమధ్యలోని వీరపనేనిగూడెం వద్ద ఎదురుగా ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వీర్ల కృష్ణకుమారి(43) అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా.. వీర్ల సుజాత(33) మృతి చెందింది. బడుగు శివనాగేంద్రమ్మ పరిస్థితి విషమంగా ఉంది. చాకిరి నాగమణి, జువ్వనబోయిన పద్మావతి, జువ్వనబోయిన నిర్మల, గుంట్రు ధనలక్ష్మి, గుంట్రు రమణ, జువ్వనబోయిన ప్రభావతి, చెన్ను వీరమ్మ, ఢిల్లీ నవ్య సహా.. మొత్తం 19 మంది గాయపడ్డారు. చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కృష్ణకుమారి, సుజాతలు వరసకు అత్తాకోడళ్లు.
గొల్లగూడెంలో విషాదఛాయలు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందడంతో గొల్లగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. వీర్ల సుజాత భర్త వీర్ల గోపాలకృష్ణ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 7, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పోషణ కోసం కూలి పనికి వెళ్లిన సుజాత విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ చిన్నారుల రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి. వీర్ల కృష్ణకుమారి భర్త వీర్ల శివనాగయ్య గొర్రెలు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు చిరు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ పోషణకు ఆమె కూడా రోజూ కూలి పనికి వెళుతోంది.
పరిమితికి మించి ప్రయాణం..
ఆటోలో పరిమితికి మించి 22 మందిని ఎక్కించుకొని ప్రమాదానికి కారణమైన డ్రైవర్ చాగంటిపాటి శివరామకృష్ణపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నఆగిరిపల్లి పంచాయతీకి చెందిన అతడు.. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు గుర్తించామని ఎస్సై పైడిబాబు తెలిపారు. నిత్యం ఇదే తరహాలో కూలీలను పనులకు తరలిస్తున్నట్లుగా గ్రామస్థులు చెప్పారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఘటిత పోరాటాల ఫలితమే కార్మిక చట్టాలు
[ 27-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఏఐటీయూసీ సమావేశం శనివారం జరిగింది. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట