logo

మమ్మల్ని అడిగేదెవరు?

వైకాపా తమకు నియమావళితో పని లేదన్నట్లు వ్యవహరిస్తోంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉంగుటూరు మండలం నారాయణపురంలో సోమవారం రాత్రి బస చేయనున్నారు.

Published : 16 Apr 2024 05:21 IST

నియమావళి ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీల ఏర్పాటు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: వైకాపా తమకు నియమావళితో పని లేదన్నట్లు వ్యవహరిస్తోంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉంగుటూరు మండలం నారాయణపురంలో సోమవారం రాత్రి బస చేయనున్నారు. ఆ ప్రాంతానికి సమీపంలో ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి మేమంతా సిద్ధం పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మమ్మల్ని ఎవరేంచేస్తారన్నట్టు నారాయణపురం జాతీయ రహదారి కూడలి, నారాయణపురం ఆర్‌అండ్‌బీ రహదారిలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బహిరంగంగా నియమావళిని అతిక్రమించినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రయాణికులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

లయన్స్‌ క్లబ్‌ ఆడిటోరియం వద్ద..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని