అయిదేళ్లూ గడ్డుకాలం
అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది.
పరిశ్రమల రంగం కుదేలు
ఔత్సాహికులకు మొండిచేయి
ఏలూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మూతపడిన పరిశ్రమలు
జిల్లాలో 2014-2019 మధ్య కాలంలో మధ్య, చిన్న తరహా పరిశ్రమలు 620 స్థాపించగా 2019-2024 కాలంలో 250 పరిశ్రమలే ఏర్పాటయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: అయిదేళ్లు.. అక్షరాలా అరవై నెలలు.. 1825 రోజులు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని భావించిన యువతకు అత్యంత విలువైన సమయం ఇది. ఈ సుదీర్ఘ కాలంలో ఉమ్మడి పశ్చిమలో ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదంటే నమ్మాల్సిందే. పోనీ ఉన్నవాటిని సజావుగా సాగనిచ్చారా.. అంటే అదీ లేదనే చెప్పాలి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులకూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కొరవడటంతో అయిదేళ్లలో ఏ ఒక్కటీ సాకారం కాలేదు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 425 భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఏలూరులో 73, భీమవరం 181, తణుకు 83, పాలకొల్లు 22, నూజివీడు 66 ఇలా కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణ యథాతథంగా ఉన్నా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు జిల్లాలో మనుగడ లేకుండాపోయింది. ఉన్న పరిశ్రమలనే మూసేలా పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని విద్యుత్తు బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఖాయిలాపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు మరో ప్రాంతానికి వలస వెళుతున్నారు.
అందని ప్రోత్సాహం.. విద్యుత్తు, స్థలం, ముడి సరకు ఇలా ప్రతీ దాంట్లోనూ రాయితీలు అందించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు లేవు. సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. అవగాహన సదస్సులతో చేతులు దులుపుకుంటున్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి సింగిల్ డెస్క్ విధానంలో కాలయాపన లేకుండా అనుమతులు ఇవ్వాలి. పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం 15 రోజుల్లో, బిల్డింగ్ ప్లాన్ 30, విద్యుత్తు కనెక్షన్ 7, కాలుష్య నియంత్రణ మండలి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనుమతి 30, అగ్నిమాపక శాఖ అనుమతి 15 రోజుల్లో ఇవ్వాల్సింది. కానీ ఆచరణలో అది జరగక కార్యాలయాల చుట్టూ ఔత్సాహికులు తిరిగితిరిగి విసిగివేసారిపోతున్నారు.
అనుమతులు రాక నిరుత్సాహం.. ఏలూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో పీవీసీ పైపుల కర్మాగారం పెడదామనుకున్న ఒక యువకుడు అనుమతులు సకాలంలో రాక ఆ ఆలోచనను విరమించుకున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి రుణం సమకూర్చుకున్నారు. సింగిల్ విండో ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నా సకాలంలో రాక నిరుత్సాహపడ్డారు. కర్మాగారం ఏర్పాటు చేయకుండానే వెనుదిరిగారు.
సరిగా లేదంటూ తిప్పారు.. ఒక యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త రూ.2 కోట్లతో ఫర్నిచర్ తయారీ పరిశ్రమ పెడదామని.. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులకు హాజరయ్యారు. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సమర్పించగా.. సరిగా లేదని అధికారులు వెనక్కు పంపారు. మళ్లీ తయారు చేయించి ఇవ్వగా.. అదీ సరిగా లేదన్నారు. విసుగు చెందిన ఆ యువకుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాలనలో.. శ్రామిక హక్కులకు సంకెళ్లు!
[ 01-05-2024]
ఒక్క అవకాశం ఇస్తే మీ జీవితాలు మార్చేస్తానంటూ గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రామికులను నిలువునా ముంచేశారు. ఏళ్లు గడిచినా హామీలను అమలు చేయకపోగా హక్కులపై గళమెత్తిన కార్మిక నేతలపై జగన్ సర్కారు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది. -
వైకాపాను సాగనంపుదాం..
[ 01-05-2024]
ఎన్డీయే కూటమి శ్రేణుల్లో తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
కూటమి ప్రభుత్వంలో ‘పోలవరం జిల్లా’
[ 01-05-2024]
పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటారా?
[ 01-05-2024]
అధికార వైకాపా పింఛనుదారులతో రాజకీయ జూదం ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా సునాయాసంగా పంపిణీ చేసే అవకాశం ఉన్నా ససేమిరా అంటూ లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. -
నచ్చకుంటే బదిలీ.. లేదా బలి
[ 01-05-2024]
నచ్చి, వారి అడుగులకు మడుగులొత్తే అందలమెక్కించడం...నచ్చకపోతే నరకం చూపించటం వైకాపా పాలనలో అనవాయితీగా మారింది. ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించటం.. డిప్యుటేషన్పై దూరంగా విసిరేయటంతో గత అయిదేళ్లలో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక పరిశీలకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్మిశ్రా అన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, పార్లమెంటు నియోజకవర్గ పోలీసు పరిశీలకుడు శైలేష్కుమార్ సిన్హా, -
కరెంటు లేక కష్టాలు
[ 01-05-2024]
అసలే ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలవరం ప్రజలు సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. జగన్నాథపేట వద్ద పరివర్తకంలో సమస్యతోపాటు పలు చోట్ల తీగలు తెగిపోవడంతో జగన్నాథపేట, -
‘అసమర్థ సీఎం.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దాం’
[ 01-05-2024]
వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అసమర్థ ముఖ్యమంత్రి.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దామని ఎన్డీయే నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, -
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం
[ 01-05-2024]
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్ అన్యాయం చేశారన్నారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
[ 01-05-2024]
దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. -
కక్ష రాజకీయాలు మనకొద్దు
[ 01-05-2024]
అభివృద్ధి అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండటమే అని.. తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే ఇది సాధ్యమని భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. -
కదిలిన కొలువుల గుట్టు
[ 01-05-2024]
వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు. -
5 వరకు సాగునీటి విడుదల
[ 01-05-2024]
డెల్టాలో పంట కాలువలకు మే 5వ తేదీ వరకు నీటి సరఫరా కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తాగునీటి వనరులతో పాటు ఆక్వా చెరువులను యుద్ధప్రాతిపదికన నింపుకొనేందుకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
నియమావళి పాటించాల్సిందే
[ 01-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా నియమావళిని కచ్చితంగా పాటించి తీరాలని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైపై పంజాబ్ విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?