వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్ అన్యాయం చేశారన్నారు.
ఐక్యత చాటుతున్న మాజీ మంత్రి జవహర్, బడేటి చంటి, దాసరి ఆంజనేయులు తదితరులు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్ అన్యాయం చేశారన్నారు. తెదేపా అమలు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అంబేడ్కర్ విదేశీ విద్యాదీవెన పథకానికి పేరు మార్చి ఆయన ప్రతిష్ఠను దిగజార్చారన్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అనేక మంది దళితులు హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఎన్డీయే ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వ హయాంలో దళితులు అన్ని విధాలుగా లబ్ధి పొందారని, వైకాపా పాలనలో వారికి ఏవిధమైన ప్రయోజనం చేకూరలేదన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ దళితులు అభ్యున్నతి సాధించాలంటే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, తెదేపా ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాలా బాలాజీ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబోయ్.. ఇంతలా తవ్వేశారా?
[ 21-05-2024]
పోలవరం ప్రధానకాలువ అంత వెడల్పు, లోతులో కందకాలు.. దాదాపు తాటిచెట్టంత ఎత్తులో నిల్వ చేసిన ఇసుక గుట్టలు.. జిల్లాలో ఎక్కడా లేనంతగా.. -
ఇసుక ర్యాంపుల తనిఖీ
[ 21-05-2024]
జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. -
సహకరిస్తే.. అండగా నిలుస్తాం
[ 21-05-2024]
ఓఎన్జీసీ పైపులైను వెళ్లే గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
చాకిరీ చేసినా.. సొమ్ముల్లేవ్!
[ 21-05-2024]
ఎన్నికల క్షేత్రంలో బూత్ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు. -
మళ్లీ వరండాలు.. అరుగులే!
[ 21-05-2024]
గతేడాది నవంబరు నుంచి నిధుల సమస్యతో కొన్ని, ఇసుక, సిమెంట్ అందుబాటులో లేక మరికొన్ని పనులు నిలిచిపోయాయి. జరుగుతున్నాయనిపించుకునేందుకు అక్కడక్కడా పనులు చేయిస్తున్నారు. -
సూర్యకిరణ ఉషస్సు.. శ్రీనివాసుని తేజస్సు
[ 21-05-2024]
ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై కొలువుతీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. -
రీ-సర్వేతో కొత్త కష్టాలు
[ 21-05-2024]
భూ రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రక్రియలో లోపాలతో ఇప్పటికే పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
రోగులకు పరీక్షే!
[ 21-05-2024]
అనారోగ్యంతో ఆసుపత్రికొస్తే అక్కడ ఓపీ చీటీ రాయించుకోవాలంటే ఆధార్నంబరుతో అనుసంధానం చేసిన చరవాణి ఉందా అని అడుగుతున్నారు. -
సోమేశ్వరునికి పంచామృతాభిషేకాలు
[ 21-05-2024]
వైశాఖమాస ద్వాదశి సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. -
పెనుగొండ యువతికి ప్రశంస
[ 21-05-2024]
పెనుగొండకు చెందిన మహ్మద్ నర్గీస్, ఆరీఫ్ మహ్మద్ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్ రుక్సార్ శనివారం రాత్రి అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో -
ఆ సర్కిల్లో అంతే!
[ 21-05-2024]
పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు.. -
‘సొమ్ము’సిల్లిన పనులు
[ 21-05-2024]
నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం చతికిలపడ్డాయి. -
రోజుకు రూ.20 వేతనం
[ 21-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రోజుకు రూ.20 వేతనం కేటాయించడంతో సిబ్బంది షాక్కు గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
-
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్
-
స్వాతీ మాలీవాల్ కేసులో బిభవ్ ముంబయికి తరలింపు
-
డీప్ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో షేర్ చేసిన కేంద్రం
-
నీ తండ్రి స్థాయేంటో తెలుసా అన్నారు : జొమాటో సీఈఓ