దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమార్తెల మృతి
తల్లి, కుమారుడికి తీవ్రగాయాలు
రుద్ర రాము కుటుంబం
పెదపాడు, ఉంగుటూరు, న్యూస్టుడే: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. పెదపాడు ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన యవ్వారి రుద్రరాము భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి మంగళవారం ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. పెదపాడు మండలం అప్పనవీడు పంచాయతీ తాళ్లమూడి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్కు ఉన్న ఇనుపరాడ్ను ఢీకొన్నారు. ప్రమాదంలో వాహనం నడుపుతున్న రుద్రరాము (33), కుమార్తె రక్షశ్రీ (9) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. అతడి భార్య శిరీష, కుమారుడు నాగదర్శిక్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో షేక్ కరీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కైకరానికి చెందిన రుద్రరాము సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతితో కైకరంలో విషాదఛాయలు అలముకున్నాయి.
భవనం పైనుంచి జారిపడి కూలీ మృతి
నిట్టా వేణు
భీమడోలు, న్యూస్టుడే: భీమడోలులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంపై నుంచి జారిపడి ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందారు. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబరుపేటకు చెందిన నిట్టా వేణు సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేణుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్ దాడి
[ 22-05-2024]
మండవల్లి మండలంలో నకిలీ శీతలపానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేశారు. -
ఎల్లలు దాటిన విజయాలు
[ 22-05-2024]
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా శాఖ ‘ప్రేరణ ఉత్సవ్’ పేరుతో ఏటా పోటీలు నిర్వహిస్తోంది. వందలాది మంది చిన్నారులు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు -
తిరగవు.. వెలగవు!
[ 22-05-2024]
విద్యుత్తు పరివర్తకాల వద్ద ఎర్త్ పైపులు సక్రమంగా లేకపోవడంతో సరఫరాలో హెచ్చుతగ్గులకు కారణమవుతోంది. ఇక తీగలు మార్పు, పాడైన, వాలిన స్తంభాల తొలగింపులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
జలసిరికి దారేదీ?
[ 22-05-2024]
ఉండిలో పడవల రేవు వద్ద ప్రధాన పంట కాలువ దుస్థితిది. ఇక్కడ ఆరేళ్ల కిందట కొత్త వంతెన నిర్మించారు. ఆ సమయంలో కాలువలో చేరిన మట్టి, ఇతర వ్యర్థాల తొలగింపు పనులు ఇప్పటికీ చేపట్టలేదు -
నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!
[ 22-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్వోలకు కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు. ఆయన ఎస్పీ అజితతో కలిసి ఆర్వోలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. -
కోర్టు చెబితే కాని కదలరా?
[ 22-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణలో ఉభయ జిల్లాల్లో అధికారుల ఉదాసీనత పరాకాష్ఠకు చేరుకుంది. న్యాయస్థానాలు మొట్టికాయలేస్తేనో.. తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తేనో తప్ప వారిలో కదలిక రావటం లేదు. -
ఇస్తారా..చేతులెత్తేస్తారా!
[ 22-05-2024]
వేసవి సెలవులు మరో 20 రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదు. -
పాడి రైతుల ఆవేదన.. అరణ్య రోదన!
[ 22-05-2024]
‘మినీ గోకులం షెడ్డు మంజూరైందంటే అప్పు చేసి పనులు మొదలుపెట్టాం. పాక తొలగించి షెడ్డు కోసం పిల్లర్లు వేశాక రూ.30 వేలు ఖాతాలో పడ్డాయి. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
[ 22-05-2024]
మన్యంలోని ఫీడర్ అంబులెన్స్ల పైలెట్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని జిల్లా మలేరియా నివారణ ఇన్ఛార్జి అధికారి, కేఆర్పురం ఇన్ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జె.సురేశ్కుమార్ హెచ్చరించారు.