కూటమి ప్రభుత్వంలో ‘పోలవరం జిల్లా’
పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు.
2027 నాటికి ప్రాజెక్టూ పూర్తి చేస్తాం
చింతలపూడి ఎత్తిపోతలనూ నిర్మిస్తాం
వారాహి విజయభేరి సభలో పవన్
కొయ్యలగూడెం సభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్
కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్టుడే: పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ సహకారంతో పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు కోసం తొలిసారి పెద్ద మొత్తంలో భూమి ఇచ్చిన కరాటం రాంబాబు కుటుంబ సభ్యుల స్ఫూర్తితో నిర్వాసితులకు మేలు చేయాలని, ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతోనే పోలవరం సీటును జనసేన కోరడం జరిగిందన్నారు.
రూ.కోటి చొప్పున విరాళం.. ప్రతిఒక్కరూ సెస్ చెల్లిస్తే ఆరు నెలల్లో నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు. అందుకు తనవంతుగా రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ తనవంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు.
కొయ్యలగూడెం సభలో సభలో మాట్లాడుతున్న పవన్కల్యాణ్. చిత్రంలో కూటమి అభ్యర్థులు బాలరాజు, పుట్టా మహేష్యాదవ్, సొంగా రోషన్ తదితరులు
అడుగడుగునా పూల వర్షం
కొయ్యలగూడెం, న్యూస్టుడే: జనసేన అధినేత పవన్కల్యాణ్కు గవరవరంలోని హెలీప్యాడ్ వద్ద కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడే దాదాపు 40 నిమిషాలు పాటు జనసేన నియోజకవర్గ నాయకులతో పవన్ మంతనాలు జరిపారు. అనంతరం కొయ్యలగూడెం సభాస్థలి వద్దకు ర్యాలీగా రాగా... దారి పొడవునా జనసైనికులు పూలవర్షం కురిపిస్తూ ముందుకు సాగారు. రాత్రి సభ అనంతరం పవన్కల్యాణ్ రోడ్డు మార్గాన నల్లజర్ల మీదుగా పిఠాపురం బయలుదేరి వెళ్లారు. సినీ నటులు హైపర్ ఆది, రాంప్రసాద్లు హెలిప్యాడ్ వద్ద సందడి చేశారు.
హాజరైన జనసందోహం
చింతలపూడి బాధ్యత మాదే
నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు గానీ ప్రభుత్వ భవనాలకు వైకాపా జెండా రంగులు వేయడానికి మాత్రం రూ.1300 కోట్లు ఖర్చు పెట్టారని, మళ్లీ వాటిని తొలగించడానికి ఇంకో రూ.100 కోట్లు ఖర్చుచేశారని పవన్ మండిపడ్డారు. ఒక సామాజిక వర్గానికి ప్రయోజనమని చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. ఆ పథకం పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం కూటమి ఆధ్వర్యంలో విడుదల చేసిన సూపర్ సిక్స్, షణ్ముఖవ్యూహం మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ శీతల పానీయాల కేంద్రంపై విజిలెన్స్ దాడి
[ 22-05-2024]
మండవల్లి మండలంలో నకిలీ శీతలపానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి దాడి చేశారు. -
ఎల్లలు దాటిన విజయాలు
[ 22-05-2024]
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా శాఖ ‘ప్రేరణ ఉత్సవ్’ పేరుతో ఏటా పోటీలు నిర్వహిస్తోంది. వందలాది మంది చిన్నారులు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు -
తిరగవు.. వెలగవు!
[ 22-05-2024]
విద్యుత్తు పరివర్తకాల వద్ద ఎర్త్ పైపులు సక్రమంగా లేకపోవడంతో సరఫరాలో హెచ్చుతగ్గులకు కారణమవుతోంది. ఇక తీగలు మార్పు, పాడైన, వాలిన స్తంభాల తొలగింపులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
జలసిరికి దారేదీ?
[ 22-05-2024]
ఉండిలో పడవల రేవు వద్ద ప్రధాన పంట కాలువ దుస్థితిది. ఇక్కడ ఆరేళ్ల కిందట కొత్త వంతెన నిర్మించారు. ఆ సమయంలో కాలువలో చేరిన మట్టి, ఇతర వ్యర్థాల తొలగింపు పనులు ఇప్పటికీ చేపట్టలేదు -
నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!
[ 22-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్వోలకు కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు. ఆయన ఎస్పీ అజితతో కలిసి ఆర్వోలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. -
కోర్టు చెబితే కాని కదలరా?
[ 22-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణలో ఉభయ జిల్లాల్లో అధికారుల ఉదాసీనత పరాకాష్ఠకు చేరుకుంది. న్యాయస్థానాలు మొట్టికాయలేస్తేనో.. తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తేనో తప్ప వారిలో కదలిక రావటం లేదు. -
ఇస్తారా..చేతులెత్తేస్తారా!
[ 22-05-2024]
వేసవి సెలవులు మరో 20 రోజుల్లో ముగియనున్నాయి. జూన్ 12న బడి తలుపులు తెరుచుకోనున్నాయి. అయినా పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ నేటికీ ఓ కొలిక్కి రాలేదు. -
పాడి రైతుల ఆవేదన.. అరణ్య రోదన!
[ 22-05-2024]
‘మినీ గోకులం షెడ్డు మంజూరైందంటే అప్పు చేసి పనులు మొదలుపెట్టాం. పాక తొలగించి షెడ్డు కోసం పిల్లర్లు వేశాక రూ.30 వేలు ఖాతాలో పడ్డాయి. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
[ 22-05-2024]
మన్యంలోని ఫీడర్ అంబులెన్స్ల పైలెట్లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని జిల్లా మలేరియా నివారణ ఇన్ఛార్జి అధికారి, కేఆర్పురం ఇన్ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జె.సురేశ్కుమార్ హెచ్చరించారు.