కదిలిన కొలువుల గుట్టు
వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు.
వైకాపా నేత పెత్తనం..అవుట్ సోర్సింగ్ నియామకాల విక్రయం
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు. అర్హత లేకపోయినా... పలువురికి అడ్డదారిలో ఉద్యోగాలు ఇప్పించారు. ఆశావహుల నుంచి పెద్దఎత్తున నగదు తీసుకొని ప్రభుత్వ కొలువులు కట్టబెట్టారు. ఈ విషయం లోకాయుక్త దృష్టికి వెళ్లడంతో తక్షణం స్పందించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముఖ్య ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ ఉద్యోగాలిచ్చిన సమయంలో విధులు నిర్వర్తించిన ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్, హెల్త్ సెక్షన్ పర్యవేక్షకుడు షేక్ సిరాజుద్దీన్, నగరపాలక సంస్థ పర్యవేక్షకుడు కేఎస్ఎన్ కృష్ణమూర్తి, జూనియర్ అసిస్టెంట్ తోట మాణిక్యాలరావుపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కార్యాలయం సిద్ధమైంది. తాజాగా వారిపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
లోకాయుక్త ఆదేశాలతో బాధ్యులపై చర్యలు.. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న 17 పొరుగు సేవల ఉద్యోగాల భర్తీకి 2021లో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా... రోస్టర్ విధానం పాటించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. వారి నుంచి అధిక మొత్తంలో నగదు వసూలు చేసి 17 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు ఫైల్ సిద్ధం చేసి కలెక్టర్తో సంతకం చేయించి ఉద్యోగాలిచ్చేశారు. అప్పట్లో అక్రమమార్గాన ఉద్యోగాలు పొందిన వారంతా ప్రస్తుతం నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఓ కార్మిక సంఘ నాయకుడైన సునీల్కుమార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా.. రాజమహేంద్రవరం ఆర్డీ కార్యాలయ అధికారులు విచారణ చేపట్టారు. అవకతవకలు జరిగాయని.. ఎక్కడా నిబంధనలు పాటించలేదని వీరి నుంచి అందిన నివేదిక మేరకు లోకయుక్త చర్యలకు ఆదేశించింది.
అన్నీతానై నడిపిన ఓ ప్రజాప్రతినిధి.. ప్రతిభ ఆధారంగా అర్హులకు రావాల్సిన 17 పోస్టులను అడ్డదారిలో అమ్మేసుకోవడం వెనుక... ఓ వైకాపా ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించారు. అన్నీతానై చక్రం తిప్పడంతో అధికారులు సైతం గుట్టుగా పని కానిచ్చేశారు. సదరు ప్రజాప్రతినిధి ఒక్కో పోస్టుకు ఏకంగా రూ.3 లక్షలు నగదు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన రూ.అరకోటి వరకూ వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబోయ్.. ఇంతలా తవ్వేశారా?
[ 21-05-2024]
పోలవరం ప్రధానకాలువ అంత వెడల్పు, లోతులో కందకాలు.. దాదాపు తాటిచెట్టంత ఎత్తులో నిల్వ చేసిన ఇసుక గుట్టలు.. జిల్లాలో ఎక్కడా లేనంతగా.. -
ఇసుక ర్యాంపుల తనిఖీ
[ 21-05-2024]
జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. -
సహకరిస్తే.. అండగా నిలుస్తాం
[ 21-05-2024]
ఓఎన్జీసీ పైపులైను వెళ్లే గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
చాకిరీ చేసినా.. సొమ్ముల్లేవ్!
[ 21-05-2024]
ఎన్నికల క్షేత్రంలో బూత్ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు. -
మళ్లీ వరండాలు.. అరుగులే!
[ 21-05-2024]
గతేడాది నవంబరు నుంచి నిధుల సమస్యతో కొన్ని, ఇసుక, సిమెంట్ అందుబాటులో లేక మరికొన్ని పనులు నిలిచిపోయాయి. జరుగుతున్నాయనిపించుకునేందుకు అక్కడక్కడా పనులు చేయిస్తున్నారు. -
సూర్యకిరణ ఉషస్సు.. శ్రీనివాసుని తేజస్సు
[ 21-05-2024]
ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై కొలువుతీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. -
రీ-సర్వేతో కొత్త కష్టాలు
[ 21-05-2024]
భూ రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రక్రియలో లోపాలతో ఇప్పటికే పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
రోగులకు పరీక్షే!
[ 21-05-2024]
అనారోగ్యంతో ఆసుపత్రికొస్తే అక్కడ ఓపీ చీటీ రాయించుకోవాలంటే ఆధార్నంబరుతో అనుసంధానం చేసిన చరవాణి ఉందా అని అడుగుతున్నారు. -
సోమేశ్వరునికి పంచామృతాభిషేకాలు
[ 21-05-2024]
వైశాఖమాస ద్వాదశి సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. -
పెనుగొండ యువతికి ప్రశంస
[ 21-05-2024]
పెనుగొండకు చెందిన మహ్మద్ నర్గీస్, ఆరీఫ్ మహ్మద్ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్ రుక్సార్ శనివారం రాత్రి అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో -
ఆ సర్కిల్లో అంతే!
[ 21-05-2024]
పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు.. -
‘సొమ్ము’సిల్లిన పనులు
[ 21-05-2024]
నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం చతికిలపడ్డాయి. -
రోజుకు రూ.20 వేతనం
[ 21-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రోజుకు రూ.20 వేతనం కేటాయించడంతో సిబ్బంది షాక్కు గురయ్యారు.