వైకాపాను సాగనంపుదాం..
ఎన్డీయే కూటమి శ్రేణుల్లో తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిద్దాం
అయిదేళ్లపాటు విశ్వసనీయతతో సేవలందిస్తాం
దెందులూరు సభలో చంద్రబాబు
కూటమి శ్రేణుల్లో జోష్ నింపిన ప్రజాగళం
దెందులూరు సభలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: ఎన్డీయే కూటమి శ్రేణుల్లో తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబు ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. ఈలలు, చప్పట్లతో జేజేలు పలికారు.
నియోజకవర్గ సమస్యల ప్రస్తావన.. ప్రజాగళం ప్రారంభానికి ముందుగా దెందులూరు నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. ఆ నియోజకవర్గం గురించి పరిచయం చేయడంతోపాటు సమస్యలను ప్రస్తావించారు. దెందులూరు నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీరు సక్రమంగా అందడం లేదన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక కేసులన్నీ తొలగించేలా చూడాలని చంద్రబాబును కోరారు. ఏలూరు జిల్లా పరిధిలోని ఒక పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని అన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి మహేశ్ కుమార్ మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏలూరులో పరిశ్రమలను నెలకొల్పుతానని అన్నారు. తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలందరూ అభివృద్ధి సాధించాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరమన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని, చిత్రంలో చంద్రబాబు, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్కుమార్యాదవ్, పార్టీ నేతలు వంగవీటి రాధా, గన్ని వీరాంజనేయులు
వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలు ఏవిధంగా నష్టపోయారనే అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. జగన్మోహన్రెడ్డి పాలనను అంతమొందించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. తెదేపా, జనసేన, భాజపాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాబోయే 12 రోజులపాటు శక్తి వంచన లేకుండా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమకు విజయం చేకూరిస్తే అయిదేళ్లపాటు ప్రజలకు విశ్వసనీయంగా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావిస్తూ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మహేశ్ కుమార్ ఎంతో సమర్థుడని అన్నారు. పేరొందిన పారిశ్రామికవేత్తలతో ఆయనకు సత్సంబంధాలున్నాయని, ఎôపీగా గెలిపిస్తే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.
హాజరైన జనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబోయ్.. ఇంతలా తవ్వేశారా?
[ 21-05-2024]
పోలవరం ప్రధానకాలువ అంత వెడల్పు, లోతులో కందకాలు.. దాదాపు తాటిచెట్టంత ఎత్తులో నిల్వ చేసిన ఇసుక గుట్టలు.. జిల్లాలో ఎక్కడా లేనంతగా.. -
ఇసుక ర్యాంపుల తనిఖీ
[ 21-05-2024]
జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. -
సహకరిస్తే.. అండగా నిలుస్తాం
[ 21-05-2024]
ఓఎన్జీసీ పైపులైను వెళ్లే గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
చాకిరీ చేసినా.. సొమ్ముల్లేవ్!
[ 21-05-2024]
ఎన్నికల క్షేత్రంలో బూత్ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు. -
మళ్లీ వరండాలు.. అరుగులే!
[ 21-05-2024]
గతేడాది నవంబరు నుంచి నిధుల సమస్యతో కొన్ని, ఇసుక, సిమెంట్ అందుబాటులో లేక మరికొన్ని పనులు నిలిచిపోయాయి. జరుగుతున్నాయనిపించుకునేందుకు అక్కడక్కడా పనులు చేయిస్తున్నారు. -
సూర్యకిరణ ఉషస్సు.. శ్రీనివాసుని తేజస్సు
[ 21-05-2024]
ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై కొలువుతీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. -
రీ-సర్వేతో కొత్త కష్టాలు
[ 21-05-2024]
భూ రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రక్రియలో లోపాలతో ఇప్పటికే పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
రోగులకు పరీక్షే!
[ 21-05-2024]
అనారోగ్యంతో ఆసుపత్రికొస్తే అక్కడ ఓపీ చీటీ రాయించుకోవాలంటే ఆధార్నంబరుతో అనుసంధానం చేసిన చరవాణి ఉందా అని అడుగుతున్నారు. -
సోమేశ్వరునికి పంచామృతాభిషేకాలు
[ 21-05-2024]
వైశాఖమాస ద్వాదశి సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. -
పెనుగొండ యువతికి ప్రశంస
[ 21-05-2024]
పెనుగొండకు చెందిన మహ్మద్ నర్గీస్, ఆరీఫ్ మహ్మద్ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్ రుక్సార్ శనివారం రాత్రి అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో -
ఆ సర్కిల్లో అంతే!
[ 21-05-2024]
పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు.. -
‘సొమ్ము’సిల్లిన పనులు
[ 21-05-2024]
నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం చతికిలపడ్డాయి. -
రోజుకు రూ.20 వేతనం
[ 21-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రోజుకు రూ.20 వేతనం కేటాయించడంతో సిబ్బంది షాక్కు గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి