నువ్వొచ్చింది మొదలు.. చెదలు
గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు.
బూజు పట్టిన పుస్తకాలు..మూతపడుతున్న భవనాలు
వైకాపా పాలనలో గ్రంథాలయాల దుస్థితి
పాలకొల్లు, నూజివీడు పట్టణం, న్యూస్టుడే బృందం : గ్రంథాలయాల్లో సమస్యల చప్పుళ్లే వినిపిస్తున్నాయి. పాత పుస్తకాలు, బూజు పట్టిన అరలు, విరిగిన బల్లలు, పని చేయని కంప్యూటర్లు..ఇవీ చాలా పుస్తకాలయాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఎంతో తపనతో వచ్చే పేద విద్యార్థులకు నిరాశకు గురి చేస్తున్నాయి. అసౌకర్యాలే స్వాగతం పలుకుతున్నాయి. గ్రంథాలయ, స్థానిక సంస్థలు నిర్వహణ ఎవరిదైనా ఈ వ్యవస్థ ఉభయ జిల్లాల్లో అస్తవ్యస్తంగా మారింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక వీటి వైపు కన్నెత్తి చూసింది లేదు. దీంతో నిరాదరణతో దాదాపుగా మూతపడే దుస్థితికి చేరాయి.
గ్రామ పంచాయతీలు నిధులను రాష్ట్రప్రభుత్వం ఎప్పుడైతే ఇష్టానుసారం వాడుకోవడం ప్రారంభించిందో అప్పటి నుంచే గ్రంథాలయాల పతనం ఆరంభమైంది. గ్రామపంచాయతీలకు ప్రజలు చెల్లించే పన్నుల నుంచి గ్రంథాలయాలకు శిస్తు రూపంలో రావాల్సిన వాటాకు పూర్తిగా గండిపడింది. దీంతో కనీసం పుస్తకం కొనాలన్నా సొమ్ముల్లేని దుస్థితికి గ్రంథాలయాలు చేరాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్కో మండలం నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు పైబడి గ్రంథాలయశాఖకు బకాయిలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.12 కోట్లు సెస్ బకాయిలుంటే దానిలో ఒక్క ఏలూరు నగరపాలక సంస్థ నుంచే రూ.7 కోట్లు రావాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తం బకాయి ఒకేచోట ఉంటే ఒక సంస్థ నిర్వహణ ఎంతకష్టమో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పట్టించుకుంటే ఇంత పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉండేది కాదు. బకాయిల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న గ్రంథాలయాధికారులకు చెల్లించాల్సింది పోయి గ్రంథాలయ భవనం పన్ను బకాయి చెల్లించాలంటూ ఎదురు ప్రశ్నించే పరిస్థితిలో నగరపాలక అధికారులున్నారు. దీంతో అసలే అస్తవ్యస్తంగా మారిన గ్రంథాలయ సంస్థ వెంటిలేటర్పైకి చేరింది.
అంతర్జాలానికి అంతరాయం
ప్రతి గ్రంథాలయానికి తెదేపా ప్రభుత్వ హయాంలో కంప్యూటర్లు, అంతర్జాల సౌకర్యం ఏర్పాటుచేసి విద్యార్థులకు అవసరమైతే అంతర్జాల విజ్ఞానం పెంపొందించేలా సౌకర్యం కల్పించారు. తర్వాత వచ్చిన సీఎం జగన్ పుణ్యమా అని గ్రంథాలయాలను తెరిచేవారే కరువవడంతో వాటిక్కూడా అంతరాయం ఏర్పడింది. గ్రంథాలయం తెరిచే సరికే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు చదువరులు సిద్ధంగా ఉండే రోజుల నుంచి ఇది వరకు గ్రంథాలయాలుండేవనే చెప్పుకొనే రోజులకు వ్యవస్థ దిగజారింది.
నరసాపురంలో రూ.1.28 కోట్లతో, తణుకులో రూ.1.02 కోట్లతో గ్రంథాలయ భవనాల నిర్మాణాలు చేపట్టారు. నిధులిచ్చే నాథుడు లేక పునాదుల దశలోనే నిలిచిపోయాయంటే వైకాపా ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతుంది.
నిధులివ్వని ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో మొత్తం 59 మంది లైబ్రేరియన్లు ఉన్నా ఏలూరు జిల్లా గ్రంథాలయంలోనే 15 మంది వరకు పనిచేస్తున్నారు. మిగిలిన 73 గ్రంథాలయాల్లో కలిపి 44 మంది పనిచేయాల్సి వస్తోంది. భీమవరం జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఇద్దరంటే ఇద్దరే పనిచేస్తున్నారు.
గ్రంథాలయంలో ప్రత్యేక గది సౌకర్యంతో ఉన్న కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. వేసవి సెలవుల నేపథ్యంలో అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి తెస్తే పేద విద్యార్థులకు, యువతకు ఎంతో మేలు. పోటీ పరీక్షలకు వెళ్లే మావంటి వారికి ఉపయోగకరం.
వి.వి.వి.నరసింహమూర్తి, భీమవరం.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి అన్ని పుస్తకాలు ఉండేవి. 2019 నుంచి ప్రభుత్వం గ్రంథాలయ సెస్ను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది. అప్పటి నుంచి కొనడం లేదు. అరకొర పుస్తకాలతోనే సరిపెడుతున్నారు. జిల్లా గ్రంథాలయాల పరిస్థితి దారుణంగా ఉంది.
జి.వి.రామారావు, ధర్మ అప్పారావు కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్, నూజివీడు
పుస్తకాలు లేకుండా ఖాళీగా కనిపిస్తున్న ఈ అరలు నూజివీడు అజరయ్యపేటలోని మున్సిపల్ గ్రంథాలయంలోనివి. గతంలో సుమారు 50 మంది నిత్యం ఇక్కడికి వచ్చేవారు. దినపత్రికలూ రాని దుస్థితిలో ప్రస్తుతం ఎవరూ రావడం లేదు.
జంగారెడ్డిగూడెంలోని శాఖ గ్రంథాలయంలో పాత పుస్తకాలే దిక్కు. ఇక్కడి సిబ్బందిని మరో చోటకు ప్రతి గురువారం ఇన్ఛార్జిగా నియమించడంతో ఆ రోజు పుస్తకవిభాగం మూతపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈసురోమంటూ... ఏమిటి మాకీ బాధ
[ 02-05-2024]
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. -
రైల్వే గేటును ఢీకొన్న లారీ
[ 02-05-2024]
ఉంగుటూరు రైల్వే గేటును బుధవారం ఊక లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో పుణె నుంచి భువనేశ్వర్ వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు కొద్ది సేపు ఉంగుటూరులో నిలిచాయి. -
కల్యాణం.. వైభోగం
[ 02-05-2024]
పారిజాతగిరి ఆలయంలో బుధవారం పద్మావతి, గోదాదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు. -
హామీల మోత.. కొర్రీలతో కోత!
[ 02-05-2024]
‘చదువు భారంగా మారకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందినీ బడికి పంపండి. అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తాం.’ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఇది. -
ఉప్పు రైతు బతుకు చేదు
[ 02-05-2024]
ఎలాంటి వంటకమైనా ఉప్పు లేనిదే రుచి ఉండదు. అది సాగు చేసే రైతు బతుకు మాత్రం చప్పగా మారింది. తరతరాలుగా దాన్నే నమ్ముకున్న వారి జీవితాలు కన్నీటి కడలిలో కరిగిపోతున్నాయి -
పథకాల బాకానే.. ప్రగతి ఊసేది
[ 02-05-2024]
సీఎం ఏలూరు సభలో పథకాల గురించి బాకాలుదటం తప్ప..జిల్లాకు చేసిన అభివృద్ధి గురించి నోరెత్తలేదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం సాయంత్రం ఏలూరు అగ్నిమాపక కూడలిలో నిర్వహించిన ఈ సభంలో ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగంలో జిల్లా, నియోజకవర్గం గురించి నాలుగు మాటల్లేవు. -
అప్పు తీర్చే విషయంలో ఘర్షణ
[ 02-05-2024]
తన మాట కాదన్నందుకు కట్టుకున్న భార్యను కడతేర్చిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. -
ఓటర్లకు బిర్యానీ గాలం
[ 02-05-2024]
ఆచంట నియోజకవర్గంలో వైకాపా ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలతోపాటు ఓటర్లను కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆచంట పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం ఆచంటలోని చినపేట, కొత్తూరు సెంటర్, కాపులపాలెం, బొంతువారిపాలెం, కోనపోతుగుంట, మానేవారిపాలెం, రావిగుంట, బాలంవారిపాలెం, కసరత్తుగుంట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం
[ 02-05-2024]
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉంటుందని భాజపా నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు -
జగన్ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
[ 02-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని జనసేన భీమవరం నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?