ఈసురోమంటూ... ఏమిటి మాకీ బాధ
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం.
ఎండలో పింఛనుదారులకు తప్పని అగచాట్లు
సమాచారం కోసం సచివాలయాలు, బ్యాంకులకు పరుగులు
ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. నాలుగేళ్ల కిందట మేము ఇంటి నిర్మాణం ప్రారంభించినపుడు. ఇసుక 6 యూనిట్లు రూ.12 వేలకు లభించేది. ఇప్పుడు రూ.30 వేలకు పైబడింది. ఇసుక ధర తగ్గితే తప్ప ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునే పరిస్థితి ఎవరికీ లేదు.-కె.విజయ, ఏలూరు
ఒకటో తేదీన వచ్చే పింఛను సొమ్ము కోసం ఎదురు చూసిన ఎందరో పింఛనుదారుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. తన స్వార్థ రాజకీయాలతో ఇళ్ల వద్ద పంపిణీకి ఎగనామం పెట్టి బ్యాంకుల్లో జమ చేసి లబ్ధిదారులతో ఆడుకుంటోంది. స్పష్టమైన సమాచారం లేక కొందరు సచివాలయాలకు వెళ్లి బ్యాంకులో జమైనట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లగా సెలవు అనే బోర్డులు చూసి నిరాశతో వెనుదిరిగారు. ఎన్నో ఏళ్లుగా ఖాతాలు నిర్వహించని వారు, రెండు మూడు ఖాతాలు ఉన్న వారు తమకు ఏ ఖాతాలో సొమ్ము జమైందో ..ఎలా తెలుస్తుందని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని, వేసవి వేళ సొమ్మును ఇళ్లకు తెచ్చి ఇవ్వకుండా ఇంత కష్టపెడతారా.. అంటూ కొందరు భగ్గుమంటున్నారు.
మార్టేరు, పెనుగొండ, పోడూరు, ఆచంట, పెనుగొండ గ్రామీణ, న్యూస్టుడే: ఆచంట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో 34,784 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా వీరిలో మూడొంతులు మందికి బ్యాంకు ఖాతాలకే సొమ్ము జమైంది. వీరిలో ఎక్కువ శాతం బ్యాంకు ఖాతాలను ఏళ్ల తరబడి వినియోగించకపోవడం, ఒక్కొక్కరూ రెండు నుంచి నాలుగు ఖాతాలు కల్గి ఉండటం వంటి ఉన్నాయి. వీరికి ఏ ఖాతాలో సొమ్ము జమైందో తెలియక బ్యాంకుల చుట్టూ ప్రదక్షిలు చేయాల్సిన పరిస్థితి. ఇక వినియోగంలో లేని ఖాతా నుంచి పునరుద్ధరణ ప్రక్రియ ఖర్చు, సమయంతో కూడినది కావడంతో వృద్ధులకు అగచాట్లు తప్పేలా లేవు. దీనితోడు 1వ తేదీ నుంచి బ్యాంకులో డ్వాక్రా, ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో పింఛను సొమ్ము కోసం పడిగాపులతోపాటు సొమ్ము కొరత సమస్య సైతం
ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
మేము ఏం పాపం చేశాం...
మేము ఏం పాపం చేశాం...ఈ ఎండలో బ్యాంకుకు వెళ్లి పడిగాపులు పడి సొమ్ములు తెచ్చుకోవాలా...ఇదెక్కడి అన్యాయం..అంటూ సచివాలయ ఉద్యోగులకు పలువురు పింఛను లబ్ధిదారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. పెనుమంట్ర మండలంలో 8439 మందికి రూ.2.4 కోట్లు రాగా 2554 మంది లబ్ధిదారులకు రూ.66.84 లక్షల సొమ్ము ఇళ్ల వద్దే పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 5885 మంది బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమైంది.
ఎండలో నడిచి బ్యాంకుకు వెళ్లా...
ఈ నెల పింఛను సొమ్ము బ్యాంకులో వేశారంటే ఎండలో నడుచుకుంటూ వెళ్లా. తీరా బ్యాంకుకు సెలవు. రైస్మిల్లు మిల్లులో కూలీగా పనిచేస్తున్నా. అద్దె ఇంట్లో ఉంటున్న నాకు ఈ పింఛను సొమ్ము ఆధారం. దీని కోసం ఇప్పుడు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిలు చేసే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడం బాధగా ఉంది.
- కోరాడ సీతమ్మ, పెనుగొండ
సొమ్ము ఇచ్చేందుకు ఇన్ని ఇబ్బందులా..
నా వయస్సు 66 ఏళ్లు. గత ప్రభుత్వ హయాం నుంచి పింఛన్ తీసుకుంటున్నా. ఏనాడూ ఇటువంటి ఇబ్బంది పడలేదు. ఇంటికి వచ్చి ఇస్తారో, బ్యాంకు ఖాతాలో జమ చేస్తారో తెలియదు. సుమారు 12 ఏళ్ల నుంచి బ్యాంకు లావాదేవీలు చేయడం లేదు. పంచాయతీకి వెళ్తే ఖాతాకు జమయ్యాయి అంటున్నారు. తీరా మేడే బ్యాంకు సెలవు. గత నెల సచివాలయ ఉద్యోగుల ద్వారా చెల్లించి ఈ నెలా మార్పు చేసి పింఛన్దారులను కష్టాలు పెడుతోంది.
- బి.సత్యనారాయణ, పోడూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ