logo

త్వరలోనే టిడ్కో గృహాలు కేటాయిస్తాం

జనసేన, తెదేపా, భాజపా కూటమి అధికారంలోకి రాగానే భీమవరానికి పూర్వ వైభవం తీసుకొస్తాుని ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వô్మ పేర్కొన్నారు.

Published : 09 May 2024 03:34 IST

భీమవరం: ప్రచార వాహనంపై రామాంజనేయులు, సుడిగాలి సుధీర్‌

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జనసేన, తెదేపా, భాజపా కూటమి అధికారంలోకి రాగానే భీమవరానికి పూర్వ వైభవం తీసుకొస్తాుని ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వô్మ పేర్కొన్నారు. భీమవరంలోని పలు వార్డుల్లో బుధవారం జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. టిడ్కో గృహాల నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులందరికీ త్వరలోనే కేటాయిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం గత అయిదేళ్లుగా ఇళ్లు కేటాయించకపోవడంతో వేలాది కుటుంబాలు అద్దె ఇళ్లలోనే జీవనం సాగించాయన్నారు. తెదేపా హయాంలో పూర్తిచేసిన ఫ్లాట్లను కూడా వారే నిర్మించినట్లు వైకాపా నాయకులు గొప్పలు చెప్పడం సబబు కాదన్నారు. ప్రస్తుతం అక్కడ ఉంటున్నవారికైనా వసతులు కల్పించారా అని ప్రశ్నించారు. కూటమి నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, చెనమల్ల చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  భీమవరంలోని పలు వార్డుల్లో రామాంజనేయులుతో పాటు సినీ నటుడు సుడిగాలి సుధీర్‌ ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ప్రతిఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని