రొయ్యకు ‘జగన్ వైరస్’
రొయ్యల పంటకు వైరస్ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి.
వైకాపా సర్కారు నిర్ణయాలతో ఆక్వా కుదేలు
పడిపోయిన సాగు విస్తీర్ణం, ఎగుమతులు
అనుబంధ రంగాలపైనా తీవ్ర ప్రభావం
సాగుదారులపై మోయలేని భారం
భీమవరం అర్బన్, న్యూస్టుడే: రొయ్యల పంటకు వైరస్ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి. రోజుల వ్యవధిలో చుట్టుపక్కల చెరువులన్నింటినీ వైరస్ చుట్టబెట్టి ఖాళీ చేసేస్తుంది. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి వైరస్ల కారణంగా సాగుదారులు తీవ్ర నష్టాలు చవిచూసినా తట్టుకొని నిలబడ్డారు. గతంలో వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, ధరల తగ్గడం వల్ల ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఈ రంగం ఈసారి మాత్రం జగన్ సర్కారు విధానాలతో సంక్షోభంలో చిక్కుకుని తిరోగమనంలో సాగుతోంది. ఈ క్రమంలో కొందరు సాగును విరమించుకుంటున్నారు.
జిల్లా నుంచి నిత్యం 350 నుంచి 450 లారీల్లో చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 200 లారీలు మాత్రమే వెళ్తున్నాయి.
అప్సడా పేరిట కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనంటూ సర్కారు హుకుం జారీ చేసింది. ఏదో మేలు కోసమే ప్రభుత్వం అలా చేస్తుందని నమ్మిన వారికి కొద్ది రోజుల్లోనే భ్రమలు తొలగిపోయాయి. ఈ చట్టంతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి.
- మేతలు, సీడ్ ధరలు అందుబాటులోకి తెస్తామని ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. ధరలు తగ్గి నష్టపోతున్నామంటూ రైతులు వాపోయిన ప్రతిసారీ దాన్ని కారణంగా చూపి ఎగుమతి సంస్థలపై విరుచుకుపడి బెదిరింపులకు గురిచేసి కొన్ని వ్యవహారాలు చక్కబెట్టారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
- గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విద్యుత్తు రాయితీలో కోత పెట్టి నిబంధనల పేరిట సాగుదారులపై పెనుభారం మోపారు. రొయ్యల ధర నిర్ణయంలో దళారులు, ఎగుమతిదారుల పాత్రను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది.
ఎంతో వ్యత్యాసం
గత ప్రభుత్వం రొయ్యల చెరువుల వద్ద విద్యుత్తు పరివర్తకాలకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించింది. ప్రస్తుత పాలకులు దాన్ని పూర్తిగా ఎత్తేశారు. నాటితో పోల్చితే పరివర్తకాల ఏర్పాటుకు రైతులపై పడుతున్న భారం (రూపాయల్లో) ఇలా..
ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి గతంలో ఏటా 3.5 లక్షల టన్నుల రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. గత రెండేళ్లలో ఇది 1.5 లక్షల టన్నులకు పడిపోయింది. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో రొయ్యల సాగులో కష్టాలు పెరిగిపోయాయి.
ఇలా తిరోగమనం (ఎకరాల్లో) ఆక్వాసాగు విస్తీర్ణం 3.12 లక్షలు
చేపల సాగు 1.94 ,,
రొయ్యల సాగు 1.18 ,,
అయిదేళ్లలో తగ్గిన విస్తీర్ణం 45 వేలు
ఉమ్మడి జిల్లాలో ఉత్పత్తి అయ్యే రొయ్యలు, చేపల ద్వారా జరిగే వార్షిక టర్నోవర్ రూ.27 వేల కోట్లు (సుమారు)
పెరిగిన ధరల కారణంగా ఎకరాకు 3 టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసే రైతుపై పడే భారం (రూపాయల్లో) ఇలా..
మేత 89,995
విద్యుత్తు ఛార్జీ 45,684
డీజిల్ ఖర్చు 43,470
మొత్తం 1,79,049
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM