logo

11న సాయంత్రం నుంచి 144 సెక్షన్‌ అమలు

ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ గురువారం తెలిపారు.

Published : 10 May 2024 03:59 IST

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ గురువారం తెలిపారు. సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషిద్ధమన్నారు. జనం గుంపులు గుంపులుగా, అయిదుగురు కంటే ఎక్కువ మంది సమూహంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పదునైన ఆయుధాలు, కర్రలు, రాళ్లు వంటివి వెంట తీసుకెళ్లడాన్ని నిషేధించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని