logo

తెరుచుకున్న రామలింగేశ్వరస్వామి ఆలయం

నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 10 May 2024 04:07 IST

పెనుమంట్ర, న్యూస్‌టుడే: నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. పూజాభిషేకాల అనంతరం స్వామిని ప్రధాన అర్చకుడు ఆర్‌.రామలింగేశ్వరశర్మ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏడాదిలో 11 నెలలు స్వామి ఆలయం నీటిలోనే ఉంటుంది. వైశాఖ మాసం నెల రోజులు స్వామి భక్తులకు దర్శనమిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని