నిధుల్లేక చతికిల‘బడి’!
ప్రభుత్వ పాఠశాలలను సమూల రూపురేఖలు మార్చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మనబడి...నాడు-నేడు పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఎక్కడ చూసినా భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
ఇదీ జిల్లాలో మనబడి... నాడు-నేడు పనుల తీరు
చింతరాజుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో నిలిచిన అదనపు తరగతి గదుల పనులు
ప్రభుత్వ పాఠశాలలను సమూల రూపురేఖలు మార్చేస్తామంటూ వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మనబడి...నాడు-నేడు పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఎక్కడ చూసినా భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వచ్చే నెలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అసౌకర్యాల మధ్యే విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి దుస్థితి నెలకొంది.
సీతాపురంలో తలుపులు, కిటీకీలు అమర్చకుండా వదిలేశారు
న్యూస్టుడే, కడప: వైకాపా ప్రభుత్వం మనబడి..నాడు-నేడు రెండో దశ పనులకు 2021, ఆగస్టు 16న శ్రీకారం చుట్టింది. జిల్లాలో 996 సర్కారు పాఠశాలల్లో పనులు చేయాలని ప్రతిపాదించగా, వీటిల్లో 910 బడుల్లో చేయాలని అనుమతిచ్చారు. మొత్తం పనుల విలువ రూ.295.25 కోట్లు కాగా, ఇప్పటికే దశల వారీగా రూ.160.70 కోట్లు విడుదల చేశారు. వాస్తవంగా 2022, జులై లోపు పనులు పూర్తి చేస్తామని పాలకులు గొప్పగా ప్రకటించారు. నిర్దేశిత గడువు దాటి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.
సమన్వయలోపమే శాపం
సమగ్ర శిక్ష అభియాన్, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, పురపాలక ప్రజారోగ్యశాఖ, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల సాంకేతిక నిపుణులకు నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల ద్వారా పనులు చేయిస్తున్నట్లు చెబుతున్నా ఆయా ప్రాంతాల్లోని అధికార పార్టీ నాయకులకు పనుల పందేరం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణలేమితో పనుల్లో జోరు కనిపించలేదు. మొదటి నుంచి రివాల్వింగ్ నిధుల విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది.
బిల్లుల గోడు వినేదెవరు?
చిన్న, పెద్ద మరమ్మతులు, రక్షిత తాగునీరు, విద్యుత్తు సరఫరా, రంగులు, ఫర్నిచర్, ఆకుపచ్చ బల్ల, వంట గది, ఆంగ్ల ప్రయోగశాల, మరుగుదొడ్లు, రక్షణ గోడ, అదనపు తరగతి గదులతోపాటు మరికొన్ని పనులు చేపట్టాలని అనుమతిచ్చారు. కొన్ని బడులకు సిమెంటు ఇచ్చినా గడ్డలు కట్టింది. ఇసుక సమస్యతో పనులు ముందుకు కదల్లేదు. అదిగో నిధులొస్తాయి.. ఇదిగో బిల్లులు ఇచ్చేస్తాం అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. తొలి విడతలో కరోనా వెంటాడినా కాస్త ఆలస్యంగానైనా పూర్తి చేశారు. రెండో దశలో పనులు సాగుతూనే ఉన్నాయి. గుత్తేదారుల బిల్లుల గోడును ఆలకించేవారు కరవయ్యారు. మూడు, నాలుగు నెలలు ఎదురుచూసిన తర్వాత విడుదల చేస్తూ వచ్చారు. ఈ ప్రభావం పనుల పురోగతిపై పడింది.
ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలే
- ఒంటిమిట్ట మండలం కొండమాచుపల్లె ప్రాథమిక పాఠశాలలో ఇంకా చలువరాయి పరచలేదు. రంగులు వేయలేదు. టీవీ, గ్రీన్ చాక్బోర్డు సరఫరా చేయలేదు. ఆర్వో కేంద్రం సామగ్రి వచ్చినా అమర్చలేదు.
- సీతాపురంలో తలుపులు, కిటీకీలు ఏర్పాటు చేయలేదు. మరుగుదొడ్ల పనులు నిలిచిపోయాయి.
- చింతరాజుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు చేపట్టాలని అనుమతిచ్చినా పునాది వరకు చేసి నిధుల్లేవని నిలిపేశారు. ఇక్కడ విద్యార్థులకు చెట్ల కింద తరగతి గదులు నిర్వహిస్తుండడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవులు అనంతరం వచ్చే నెల 12న బడి గంట Ëమోగనుంది. ఈలోపు మిగతా పనులను పూర్తి చేయించాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. మూడేళ్లుగా నిధుల విడుదలతో జాప్యం చేసి ఇప్పుడు తొందరగా చేయాలని హడావుడి చేయడమేంటని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు.
శరవేగంగా పూర్తి చేయిస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మనబడి...నాడు-నేడు పనులను శరవేగంగా పూర్తి చేయిస్తాం. ఇప్పటికే చాలాచోట్ల ముగింపు దశలో ఉన్నాయి. ఎక్కడైతే పనులు నిదానంగా జరుగుతున్నాయో సమాచారాన్ని సేకరిస్తున్నాం. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ లోగా పనులన్నింటినీ పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం.
రాఘవరెడ్డి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండల కేంద్రంలో చోరీ
[ 16-06-2024]
మండల కేంద్రంలోని జి. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
అక్రమాలపై ‘రామ’బాణం సంధించాలి!
[ 16-06-2024]
వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలో చేపట్టిన కాలేటివాగు ప్రాజెక్టుతోపాటు కురబలకోట మండలం ముదివేడు జలాశయం నిర్మాణపనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉంది. -
కడపలో నటి నిధి అగర్వాల్ సందడి
[ 16-06-2024]
కడప నగరంలో శనివారం సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన జోస్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల షోరూంను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవితో కలిసి ప్రారంభించారు. -
సరఫరా... అరకొర!
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న బడి గంట మోగింది. అదే రోజు విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. -
కబ్జాలపై ఉక్కుపాదం మోపండి!
[ 16-06-2024]
వైకాపా విధ్వంసకర పాలనకు చరమగీతం పాడిన తెదేపా, జనసేన, భాజపా కూటమిపై జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకించి జగన్ సర్కారు బాధితులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది వైకాపా నేతలు ఊరూవాడ భూములను కాజేశారు. -
ఇసుక తరలింపుపై వైకాపా నాయకుల గొడవ... దాడికి యత్నం
[ 16-06-2024]
ఇసుక తరలింపుపై ప్రొద్దుటూరులో వైకాపా ముఖ్య నేతల అనుచరులు పెన్నా నదిలో దాడులకు పాల్పడుతున్నారు. తమ ఏరియాలో తాము మాత్రమే ఇసుకను తరలించాలని ఇతరులు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. -
మంత్రి మండిపల్లి రాకతో పులకించిన రాయచోటి
[ 16-06-2024]
రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్రెడ్డి రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం రాయచోటికి వచ్చారు. -
పీలేరు... అక్రమాల జోరు!
[ 16-06-2024]
నియోజకవర్గ కేంద్రం పీలేరు విద్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగానే పంచాయతీకి ఆదాయం సమకూరుతోంది. అధికారం తమదేనని, అడిగేవారు లేరని గత వైకాపా ప్రభుత్వ హయాంలో పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా