డిగ్రీ, పీజీ విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ పీజీ కళాశాలల విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం(యోవేవి) కులసచివులు విజయరాఘవప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, అఫిలియేటెడ్
4 వేల మంది విద్యార్థులకు అవకాశం
యోవేవి(కడప), న్యూస్టుడే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ పీజీ కళాశాలల విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం(యోవేవి) కులసచివులు విజయరాఘవప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, అఫిలియేటెడ్ కళాశాలల ప్రధానాచార్యులతో వర్చువల్ విధానంలో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి జిల్లా నుంచి డిగ్రీ, పీజీ కోర్సులు చదివే 4 వేల మంది విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు ఉంటాయన్నారు. భవిష్యత్తు ఉద్యోగాల కల్పనకు ఉపయుక్తమయ్యే 45 కోర్సులు ఉన్నాయన్నారు. కోర్సు పూర్తయ్యాక పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి సర్టిఫికెట్ జారీ చేస్తారన్నారు. మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ కోర్సుల యోవేవి నోడల్ అధికారి పి.రెడ్డయ్య మాట్లాడుతూ.. అధునాతన కంప్యూటర్ కోర్సులకు ఉచితంగా ఆన్లైన్లో నిపుణులు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు చంద్రమతి శంకర్, ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కళాశాల నోడల్ అధికారి కిరణ్, జిల్లాలోని అన్ని కళాశాలల ప్రధానాచార్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం