గురుకులం నుంచి 29 మంది విద్యార్థుల పరారు
బి.కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీయట్ రెండో సంవత్సరం చదువుతున్న 29 మంది విద్యార్థులు గురువారం పరారుకావడం కలకలం రేపింది.
గంటల వ్యవధిలోనే గుర్తింపు
కౌన్సెలింగ్ ఇచ్చిన ఆర్డీవో, డీఎస్పీ
విద్యార్థులతో మాట్లాడుతున్న మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప, అధికారులు
బి.కొత్తకోట, న్యూస్టుడే: బి.కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీయట్ రెండో సంవత్సరం చదువుతున్న 29 మంది విద్యార్థులు గురువారం పరారుకావడం కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం తర్వాత రెండు గంటలకు విద్యాలయం ప్రహరీ దూకి వెళ్లిపోగా సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో ఆచూకీ దొరడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు దారి తీసిన కారణాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయాధికారిని కోరినట్లు మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప ప్రకటించారు. జూనియర్ విద్యార్థులను కొందరు రెచ్చగొట్టి సీనియర్లుగా ఉన్న తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇద్దరు అధ్యాపకుల కారణంగా వేధింపులకు గురవుతున్నామని విద్యార్థులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులతో పాటు అధికార యంత్రాంగం పరుగులు తీయాల్సి వచ్చింది. విద్యార్థుల ఆచూకీ కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మదనపల్లె ఆర్డీవో మురళి, డీఎస్పీ కేశప్ప హుటాహుటిన బి.కొత్తకోటకు చేరుకున్నారు. ఈలోగా కొందరు విద్యార్థులు బెంగళూరు రోడ్డులో ఉన్నట్లుగా సమాచారం రావడంతో వారిని పోలీసులు పట్టుకుని గురుకులానికి తరలించారు. ప్రత్యేక గదిలో విద్యార్థులతో అధికారులు రెండు గంటల పాటు మాట్లాడారు. అనంతరం అధికారులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి చదువుపై శ్రద్ధ చూపాలని సూచించారు. గురువారం రాత్రి విలేకరులతో ఆర్డీవో మాట్లాడుతూ గురుకుల విద్యాలయంలో సమస్యలను పరిష్కరించడానికి సత్వరం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. విద్యార్థులు ఆవేశానికి గురికావద్దని, పరీక్షలు దగ్గర పడుతున్నందువల్ల బాగా చదువుకోవాలని హితవు పలికారు. మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు, ఎస్.ఐ. రామమోహన్, డీటీ హరికుమార్, ఎంఈవో రెడ్డిశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు