logo

అక్కాచెల్లెమ్మలకు ఆర్థికాభివృద్ధికి ఆసరా

అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Mar 2023 04:03 IST

స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, నాయకులు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎర్రగుంట్ల పట్టణ శివార్లలో ప్రొద్దుటూరు రోడ్డులోని ఓ కల్యాణ మండలంలో గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ 3వ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్మే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల మండలంలోని 1,196 స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రూ.10,92,41,447 మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు తమ్మిశెట్టి బాలయ్య, ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఛైర్మన్‌ హర్షవర్ధన్‌రెడ్డి, కమిషనర్‌ జగన్నాథ్‌, ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి, ఏపీఎం జగదీశ్వరీ, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మహిళలందరూ రహదారిపైకి రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. కల్యాణ మండపం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే రద్దీని గమనించి తిరిగి వెనక్కు వచ్చి ఆటోడ్రైవర్లను పిలిచి డబ్బులిచ్చి క్షేమంగా మహిళలను ఇళ్ల వద్ద దింపాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని