అక్కాచెల్లెమ్మలకు ఆర్థికాభివృద్ధికి ఆసరా
అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, నాయకులు
ఎర్రగుంట్ల, న్యూస్టుడే: అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎర్రగుంట్ల పట్టణ శివార్లలో ప్రొద్దుటూరు రోడ్డులోని ఓ కల్యాణ మండలంలో గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ 3వ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్మే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల మండలంలోని 1,196 స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రూ.10,92,41,447 మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు తమ్మిశెట్టి బాలయ్య, ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఛైర్మన్ హర్షవర్ధన్రెడ్డి, కమిషనర్ జగన్నాథ్, ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి, ఏపీఎం జగదీశ్వరీ, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మహిళలందరూ రహదారిపైకి రావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కల్యాణ మండపం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే రద్దీని గమనించి తిరిగి వెనక్కు వచ్చి ఆటోడ్రైవర్లను పిలిచి డబ్బులిచ్చి క్షేమంగా మహిళలను ఇళ్ల వద్ద దింపాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు