కడపలో సిటీ బస్సులు తిప్పలేరా?
వైయస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప నగరానికి జిల్లాతోపాటు పక్క జిల్లా అన్నమయ్య నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సుల్లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఆటో ఛార్జీలు భరించలేక సామాన్యుల పాట్లు
న్యూస్టుడే, చిన్నచౌకు(కడప)
వైయస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప నగరానికి జిల్లాతోపాటు పక్క జిల్లా అన్నమయ్య నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు నగరంలోని ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు సిటీ బస్సుల్లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. సీఎం జగన్, ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి జిల్లాకు చెందినవారైనా సిటీ బస్సు సర్వీసులు లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రెండు జిల్లాల నుంచి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి పెద్దసంఖ్యలో రోగులు, సహాయకులు తరలివస్తుంటారు. ఆసుపత్రికి ప్రస్తుతం కడప నగరం నుంచి ఒక బస్సు తిరుగుతోంది. ఆసుపత్రి మార్గంలో శిల్పారామం, క్రీడాపాఠశాల, దంత వైద్యశాల, ఇందిరా నగర్, సింగపూర్ టౌన్షిప్, రామకృష్ణమఠం, హైదరాబాద్ పబ్లిక్ పాఠశాల, నగరవనం తదితర ప్రాంతాలున్నాయి. ఇక వారాంతపు సెలవుల్లో శిల్పారామం, నగరవనానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైగా విమానాశ్రయం కూడా ఉంది. ఒక కుటుంబం ఆటోలో వెళ్లాలంటే రూ.వందల్లో ఖర్చవుతోంది. ఆయా మార్గాల్లో సిటీ బస్సులు తిప్పితే అటు ప్రజలకు, ఇటు ఆర్టీసీకి ప్రయోజనం ఉంటుంది. అధికారులు మాత్రం ఒకటి, రెండు రోజులు నడిపి ఆదరణ లేదని ఆపేస్తున్నారు. ‘మా కుటుంబసభ్యులు నలుగురం నగరవనానికి వెళ్లి రావడానికి ఆటోకు రూ.300 వరకు ఖర్చవుతోంది. అదే సిటీ బస్సులో ఒక్కొక్కరికి రూ.20 చొప్పున రానుపోను రూ.160 సరిపోతుంది. కడప నగరం నుంచి కడప సర్వజన ఆసుపత్రికి ఒకే బస్సు ఉంది. అదీ ఎప్పుడు వస్తుందో తెలియదు.’ అని నగరానికి చెందిన ఒప్పంద ఉద్యోగి ప్రవీణ్ కుమార్ వాపోయారు. ఈ విషయమై ఆర్టీసీ డీఎం ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతానికి కడప నగరం నుంచి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఒక బస్సు నడుస్తోందని, ఆదాయం పెరిగితే మరికొన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సిటీ బస్సుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ