డబ్బులివ్వందే బిడ్డనూ చూడనివ్వరు!
‘కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే వారంతా పేదలే. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఆసుపత్రికి రావడానికే ఇబ్బందులు పడుతుంటాం.
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న సిబ్బంది
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వసూళ్లు
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కాన్పుల విభాగం
న్యూస్టుడే, సర్వజన ఆసుపత్రి : ‘కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే వారంతా పేదలే. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఆసుపత్రికి రావడానికే ఇబ్బందులు పడుతుంటాం. ఆసుపత్రిలో కూర్చుంటే, దుస్తులు మారిస్తే, వార్డు మారిస్తే, ప్రసవమైతే ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. లేవని మొత్తుకున్నా వినడంలేదు. ఇవ్వకుంటే బూతులు తిడుతున్నారు. వైద్యులు, నర్సులు బాగానే చూస్తున్నా కొంతమంది సిబ్బంది తీరు చాలా బాధాకరంగా ఉంది.’ ఇదీ ఓ బాలింత తల్లి రామలక్షుమ్మ ఆవేదన.
కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొందరు సిబ్బంది డబ్బుల కోసం వేధిస్తున్నారని బాలింతలు, వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవాల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వైద్యులు వారికి సేవలందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాన్పుల విభాగంలోని కొంతమంది సిబ్బంది ప్రసవమైన వారి (బాలింత) బంధువులను పిలిచి డబ్బులివ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మగబిడ్డ పుడితే ఓ రేటు, ఆడబిడ్డకో రేటు చెప్పి, ఇవ్వకుంటే దుర్భాషలాడుతున్నారు. తమతో పాటు వైద్యులకు, నర్సులకు, ఓటీలో పని చేసే వారికి కూడా తామే డబ్బులివ్వాలని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే రూ.వేలు ఖర్చవుతాయని, ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, మాకు రూ.వెయ్యి, రూ.రెండు వేలు ఇవ్వలేరా అని దబాయిస్తున్నారు. పేదలను డబ్బుల కోసం పీడించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని గర్భిణలు, బాలింతలు వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
తర్వాత ఇస్తామన్నా వినడం లేదు
కాన్పు అనంతరం పారిశుద్ధ్య విభాగం, ఓటీ సహాయకులు (ఓటీ అసిస్టెంట్లు) బంధువులను పిలిచి ఆడబిడ్డను వారి చేతికి ఇవ్వాలంటే రూ.500 నుంచి రూ.1,000 వరకు డిమాండు చేస్తున్నారు. మగ బిడ్డ పుడితే రూ.2వేలు వరకు అడుగుతున్నారు. ఇవ్వకుంటే శిశువును కనీసం చూపించడం లేదు. తమ దగ్గర సొమ్ము లేదని, బంధువులు వచ్చాక ఇస్తామని చెప్పినా వినడం లేదు. పక్క బెడ్ వారి వద్ద అప్పు తీసుకుని, మాకిచ్చి మీ వాళ్లు తర్వాత వాళ్లకు ఇవ్వండి అని దబాయిస్తున్నారు. నిలదీస్తే తల్లీపిల్లలకు సరైన వైద్యం చేయరనే భయంతో వారిని ఏమీ అనలేక, అప్పో సొస్పో చేసి వారు అడిగిన మొత్తం ఇస్తున్నాం.
దేవమణి, బాలింత తల్లి, వేంపల్లె
బెదిరించి మరీ వసూలు చేస్తున్నారు
ప్రసవాల విభాగంలో సీసీ కెమెరాలు, వైద్యులు, నర్సులు, భద్రతా సిబ్బంది చాలామంది ఉంటారు. ఇంత మంది ఉన్నా కొందరు దౌర్జన్యం చేసి బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటే వారంతా ఒక్కటేనని అర్థమవుతోంది. అధికారులు, వైద్యులు, నర్సులందరూ వారికి అనుమతులిచ్చి డబ్బులు వసూలు చేయిస్తున్నారేమోనని అనుమానం వస్తోంది. ఇక్కడికి ఎక్కువగా పేదలే వస్తుంటారు. వారి దగ్గర వేలాది రూపాయలు లాక్కుంటున్నారు. ఇవ్వకుంటే బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలి.
సుబ్బులమ్మ, బాలింత అక్క, రామాపురం
ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
గర్భిణులు ఆసుపత్రికి వస్తే కొందరు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. నిండు చూలాలు అనే కనికరం కూడా లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. దీంతో భయమేసి చాలా మంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. ఏం అడిగినా సిబ్బంది పలకరు. కొంచెం గట్టిగా అడిగితే మర్యాద లేకుండా దుర్భాషలాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ ఏ మాత్రం లేదు.
కళావతి, బాలింత తల్లి, ఖాజీపేట
చర్యలు తీసుకుంటాం
ఆసుపత్రిలో అన్ని సేవలూ ఉచితమే. ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలా వసూలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రోగుల పట్ల సిబ్బంది సహనంతో ఉండి వైద్యం అందించాలి. సమస్య ఏదైనా ఉంటే బాధితులు మాకు ఫిర్యాదు చేయండి.
డాక్టర్ రమాదేవి, సూపరింటెండెంట్, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొడవలకు దిగితే రౌడీషీట్
[ 17-05-2024]
మండలంలోని పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గొడవలకు దిగితే రౌడీషీట్ తెరవడంతో పాటు జిల్లా, మండల బహిష్కరణ చేస్తామని ... -
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!