‘సీఎం ఎన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మరు’
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నటన రాష్ట్రం, దేశం దాటి హాలీవుడ్ స్థాయికి చేరిందని అందులో భాగమే రాళ్ల దాడి ఘటన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు.
అరవిందనగర్ (కడప), న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నటన రాష్ట్రం, దేశం దాటి హాలీవుడ్ స్థాయికి చేరిందని అందులో భాగమే రాళ్ల దాడి ఘటన అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కడపలో సోమవారం ఆయన మాట్లాడుతూ జగన్ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని, గత ఎన్నికల్లో కోడికత్తి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య, ఇప్పుడు గులకరాయి డ్రామా అని పేర్కొన్నారు. ఆయన చేస్తున్న నటన, డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. పవన్కల్యాణ్పై దాడి జరిగితే జనసైనికులు వెంటనే పట్టుకున్నారని, సీఎం జగన్పై జరిగిన దాడిని అటు కార్యకర్తలుగానీ, ఇటు పోలీసు అధికారులుగానీ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. చిన్నాన్నను చంపితే బాధపడని జగన్కు చిన్న రాయి తగిలితే ఎందుకు అంత బాధని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వైకాపాకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. తెదేపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గన్నెపాటి మల్లేష్, బెస్త సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ యాటగిరి రాంప్రసాద్, నాయకులు పోతుగంటి పీరయ్య, కుప్పాల వెంకటసుబ్బయ్య, నటరాజు, గంధంప్రసాద్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!