logo

కేంద్రబలగాలతో పోలీస్‌ల కవాతు

సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రాత్త చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ చిరంజీవి, ఎస్సై నాగమురళి తెలిపారు.

Updated : 16 Apr 2024 20:12 IST

కలసపాడు: సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రాత్త చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ చిరంజీవి, ఎస్సై నాగమురళి తెలిపారు. మండలంలోని చింతలపల్లె, ఎగువ రామాపురం, ఎగువ తంబర్లపల్లె గ్రామాల్లో కేంద్ర బలగాలతో పోలీస్‌ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 144 సెక్షన్‌ అమలులో ఉండటంతో అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని