logo

తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు

తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.

Published : 30 Apr 2024 06:36 IST

ఇంటికొచ్చి దాడి చేశారని  పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ నేత

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సిద్దవరం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు

పెనగలూరు, న్యూస్‌టుడే: తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో సిద్దవరంలోని తన ఇంటి తలుపు చప్పుడు కావడంతో వెళ్లి తలుపు తీయగా గుర్తు తెలియని ఆరు మంది దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. తన చరవాణిని లాక్కుని అసభ్యంగా తిట్టి కొట్టారన్నారు. వైకాపాకు వ్యతిరేకంగా తిరుగుతున్నావా నీ అంతు చూస్తామంటూ దుండగులు బెదిరించినట్లు చెప్పారు. మే 14వ తేదీ వరకు గ్రామం నుంచి వదిలి వెళ్లాలని లేకుంటే అంతం చేస్తామంటూ హెచ్చరించినట్లు వివరించారు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనగలూరు ఎస్సై సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని