తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని బెదిరింపు
తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.
ఇంటికొచ్చి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ నేత
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సిద్దవరం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు
పెనగలూరు, న్యూస్టుడే: తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదించారని ఆ పార్టీ నాయకుడు సిద్దవరం వెంకటేశ్వర రెడ్డి పెనగలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో సిద్దవరంలోని తన ఇంటి తలుపు చప్పుడు కావడంతో వెళ్లి తలుపు తీయగా గుర్తు తెలియని ఆరు మంది దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. తన చరవాణిని లాక్కుని అసభ్యంగా తిట్టి కొట్టారన్నారు. వైకాపాకు వ్యతిరేకంగా తిరుగుతున్నావా నీ అంతు చూస్తామంటూ దుండగులు బెదిరించినట్లు చెప్పారు. మే 14వ తేదీ వరకు గ్రామం నుంచి వదిలి వెళ్లాలని లేకుంటే అంతం చేస్తామంటూ హెచ్చరించినట్లు వివరించారు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెనగలూరు ఎస్సై సుభాష్చంద్రబోస్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొడవలకు దిగితే రౌడీషీట్
[ 17-05-2024]
మండలంలోని పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గొడవలకు దిగితే రౌడీషీట్ తెరవడంతో పాటు జిల్లా, మండల బహిష్కరణ చేస్తామని ... -
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి