logo

వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదాం

రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలవుతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి, బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న పిలుపునిచ్చారు.

Published : 30 Apr 2024 06:44 IST

పార్టీలో చేరిన వారితో తెదేపా బద్వేలు బాధ్యుడు రితేష్‌ రెడ్డి, భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న, నాయకులు

బి.కోడూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలవుతాయని తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి, బద్వేలు భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్న పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక బి.కోడూరు, ఎస్సీకాలనీ, బీసీకాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రితేష్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. స్థానికి బీసీ కాలనీలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రజక సామాజిక వర్గం నుంచి సుమారు 50 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరారు. బి.కోడూరు యువత సతీష్‌, సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాయలకుంట్ల నుంచి బి.కోడూరు గ్రామానికి బైక్‌ ర్యాలీ నిర్వహించి రితేష్‌రెడ్డి, భూపేష్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. బి.కోడూరులోని సమస్యలపై మాట్లాడారు. బద్వేలు నియోజకవర్గంలో ప్రజలు కమలం గుర్తుకు, ఎంపీ అభ్యర్థికి తెదేపా సైకిల్‌ గుర్తుకు ఓటు వేయించాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని