అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు
రూ.32 వేలు తీసుకుంటుండగా పట్టివేత
వెంకటరత్నం, ట్రాన్కో ఏఈ
అంగళ్లు (కురబలకోట), న్యూస్టుడే : నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు. కురబలకోట మండలంలో మంగళవారం జరిగిన ఈ ఉదంతం వివరాలను కడప ఏసీబీ డీఎస్పీ వి.గిరిధర్ మీడియాకు తెలిపారు. తెట్టు పంచాయతీ చింతపల్లెకు చెందిన మధుకర్రెడ్డి, అతని తండ్రి రాజారెడ్డి, చిన్నాన్న రఘునాథరెడ్డి రైతులు. వీరికి సర్వే నంబరు 659-2లో 14 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ పనుల నిమిత్తం గతేడాది నవంబరు 23న రెండు విద్యుత్తు సర్వీసులకు సంబంధించి రూ.23,300 చొప్పున రూ.46,600 చెల్లించారు. కనెక్షన్లు ఇవ్వాలని అంగళ్లులోని విద్యుత్తు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేక పోయింది. ఈ క్రమంలో గట్టిగా అడిగితే లంచం ఇవ్వనిదే కనెక్షన్లు మంజూరు చేయనని ఏఈ వెంకట రత్నం చెప్పారు. రెండు కనెక్షన్లకు సంబంధించి రూ.35 వేలు లంచం డిమాండు చేయగా అంత ఇచ్చుకోలేమని బతిమాలుకున్నారు. ఇంతలో సర్దుకున్న ఏఈ ఎట్టకేలకు రూ.32 వేలకు బేరం కుదుర్చుకున్నా,రు. ఏఈ ఇచ్చిన సమాధానం చరవాణిలో రికార్డు చేసి సమాచారాన్ని కడపలోని అనిశా అధికారులను అందజేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. వారి సూచన మేరకు అడిగిన డబ్బు ఇస్తానని, ఎక్కడికి రావాలో చెప్పాలని ఏఈకి ఫోన్ చేయించగా మంగళవారం కదిరి రోడ్డులోని ఓ కళాశాల ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్దకు రావాలని సూచించారు. దీంతో వల పన్నిన అనిశా అధికారులు డబ్బులు తీసుకుంటున్న ఏఈని అక్కడే కాపు కాసి పట్టుకున్నారు. ట్రాన్స్కో కార్యాలయానికి తరలించి విచారణ అనంతరం ఏఈపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చింతలపల్లెలో పోలీసుల కవాతు
[ 21-05-2024]
మండలంలోని చింతలపల్లిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మంగళవారం పోరుమామిళ్ల సీఐ చిరంజీవి, ఎస్సై నాగమురళి, పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. -
అదును చూసి... ఆక్రమించేసి..!
[ 21-05-2024]
గత కొన్ని నెలలుగా అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సమయంలో ఇదే అదునుగా ఆక్రమార్కులు రెచ్చిపోయారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీరికి కొందరు రెవెన్యూ శాఖాధికారులు పరోక్షంగా సహకరించారు. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు!
[ 21-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష కార్యకర్తల తలలు పగలకొడుతూ.. వారి ఏజెంట్లను ఎత్తుకుపోతూ వైకాపా నాయకులు భయానక వాతావరణం సృష్టించగా పోలీసులు నిద్రపోయారు. -
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టేది?
[ 21-05-2024]
మదనపల్లె పట్టణంలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో యజమానులు పట్టణ ప్రణాళిక నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
పేలుళ్లపై ఆందోళన
[ 21-05-2024]
మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని గుట్టలో అక్రమంగా పేలుళ్లకు పాల్పడుతూ స్థలాలను చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఐటీయూసీ నాయకుడు కృష్ణమూర్తి డిమాండు చేశారు. -
బాభౌయ్!
[ 21-05-2024]
రాజంపేట పట్టణంలోని కొలిమి వీధిలో నాలుగు నెలల కిందట ఓ చిన్నారిని ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయట పడింది. -
జలం జారిపోతోంది!
[ 21-05-2024]
జిల్లాలో తీవ్ర వర్షాభావం పరిస్థితులతో భూగర్భ జలాలు పాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ, తాగునీటి గొట్టపు బావులు ఒట్టిపోతున్నాయి. మడుగులు, కుంటలు, చెరువులు నోరెళ్ల బెట్టాయి. బావులు తడారిపోయాయి. -
వెల్లాలలో వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం
[ 21-05-2024]
రాజుపాళెం మండలం వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయునిస్వామి, భీమలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శ్రీచెన్నకేశవ, శ్రీదేవి, భూదేవిల కల్యాణం వైభవంగా జరిగింది. -
మంగంపేట గనుల్లో చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు
[ 21-05-2024]
మంగంపేట ముగ్గురాయి గనుల్లో చట్ట విరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ గనుల భద్రత విభాగం డీడీ కోటం నాయుడు హెచ్చరించారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
[ 21-05-2024]
జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ నోడల్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
‘దాడులకు ఉసిగొల్పింది వైకాపా నాయకులే’
[ 21-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప గౌస్నగర్లో జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యులు వైకాపా నాయకులేనని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళి ఆరోపించారు. -
చీకట్లో తనిఖీలా!
[ 21-05-2024]
ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి సమీపంలో పెన్నానదిలో అధికారికంగా అనుమతిచ్చిన ఇసుక రేవును అధికారుల కమిటీ బృందం చీకట్లో తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
రైల్ మదద్తో ప్రయాణికుడికి విలువైన వస్తువుల అప్పగింత
[ 21-05-2024]
రైలులో మిస్ అయిన విలువైన వస్తువులను ‘రైల్ మదద్’ సాయంతో సంబంధిత ప్రయాణికుడికి అందించిన ఘటన కడప రైల్వేస్టేషన్లో సోమవారం జరిగింది. -
రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు
[ 21-05-2024]
గొల్లపల్లి గ్రామశివారులో పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నదిలోకి వాహనాలు వెళ్లకుండా గతంలో అధికారులు గుంతలు తవ్వించగా, ఇసుకాసురులు బరితెగించి పూడ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!
-
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
-
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ