logo

తెదేపాలో చేరిన 40 కుటుంబాలు

మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.

Published : 05 May 2024 19:07 IST

కలసపాడు: మండలంలోని పెండ్లిమర్రి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సమక్షంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. వైకాపాకు చెందిన నాగిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రామలక్ష్మి రెడ్డి, దప్పిలి రామలక్ష్మయ్య, ముత్తుముల కృష్ణారెడ్డి తదితరులు తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు రంతూ, మాజీ జడ్పీటీసీ రాంభూపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు నాగేంద్రరావు, రామాంజనేయరెడ్డి, దుగ్గిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని