ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు.
భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి
మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి
పెద్దమండ్యం, న్యూస్టుడే : రాజంపేట పార్టమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రాజ్యం అమల్లో ఉందని మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగే దోపిడీలు, దౌర్జన్యాలు, వైకాపా నాయకుల పాపాలకు ఆ పెద్దిరెడ్డే కారకుడని ఆరోపించారు. పెద్దమండ్యం మండలం తురకపల్లె, కలిచెర్లలో సోమవారం నిర్వహించిన రోడ్షోలలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి, భాజపా సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, సినీ నటుడు సాయికుమార్లతో కలిసి మాట్లాడారు. సమస్య అడిగినందుకు నిండు గర్భిణిపై నిర్ధాక్షిణ్యంగా దాడి చేసిన వైకాపా నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సైకోలకు మరోసారి అవకాశమిస్తే మీ మీద మీకే హక్కు లేకుండా చేస్తారని వ్యాఖ్యనించారు. ముస్లిం మైనార్టీల్లో కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనే అన్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం సినీనటుడు సాయికుమార్ మాట్లాడుతూ కనిపించే మూడు సింహాలు మోడీ, అమిషా, నడ్డా అయితే కనిపించని నాలుగో సింహమే కిరణ్కుమార్రెడ్డి అని అన్నారు. ఈ సందర్భంగా శివపురం ఎంపీట©సీసభ్యుడు రుక్మాంగధరెడ్డి భాజపాలో చేరారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్తాజ్, ప్రచార సమన్వయకర్త మల్లికార్జున నాయుడు, బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, నాయకులు విశ్వనాథ్రెడ్డి, ప్రసాద్, నాగేశ్వర్రెడ్డి, మహేష్, నాగేశ్వర్, లక్ష్మీనారాయణ, గంగాధర్ పాల్గ్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!