logo

గెలిపిస్తే.. ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతాం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం కృషి చేస్తానని కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి అన్నారు.

Published : 08 May 2024 05:44 IST

ఖాజీపేట: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం కృషి చేస్తానని కడప తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఖాజీపేటలో తెదేపా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సుంకు సత్యంతో పాటు ఇతర నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు భూపేష్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. భూపేష్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలన్నారు. మూడు దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తున్నా అభివృద్ధి లేదన్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పించి గెలిపిస్తే.. కడపకు ఉక్కు కర్మాగారం తీసుకొచ్చేందుకు కృషి చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకు సత్యనారాయణ, ఇరగంరెడ్డి ప్రతాపరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, పూల రియాజ్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు