logo

కొనసాగిన పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌

పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ మూడోరోజు మంగళవారం కొనసాగింది. కడప ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉద్యోగులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. 

Published : 08 May 2024 06:10 IST

అరవిందనగర్‌ (కడప): పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ మూడోరోజు మంగళవారం కొనసాగింది. కడప ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఉద్యోగులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు.  దరఖాస్తు చేసుకున్నా ఓటు రాలేని వారికి మరో అవకాశం కల్పించారు.  ఆర్డీవో కార్యాలయం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ సాగింది. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు రావడంతో ఎన్నికల అధికారి మధుసూదన్‌, ఇతర అధికారులు ప్రాంగణం బయటకు వచ్చి పర్యవేక్షించారు. తెదేపా అభ్యర్థి మాధవి , వైకాపా అభ్యర్థి అంజాద్‌బాషా పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు