అకాల వర్షం... అపార నష్టం
జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు ఉద్యాన పంటలైన మామిడి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో మామిడి, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి.
బి.కొత్తకోటలో 80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
జిల్లావ్యాప్తంగా ఉద్యాన తోటలు, పంటలకు దెబ్బ
రాజంపేట మండలం ఆకేపాడులో గాలివానకు నేలకూలిన అరటి తోట వద్ద రైతులు
రాయచోటి, రాజంపేట గ్రామీణ, బి.కొత్తకోట, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు ఉద్యాన పంటలైన మామిడి, అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాలలో మామిడి, అరటి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. సుమారు వెయ్యి ఎకరాల్లో తోటలు నేలకొరిగినట్లు అంచనా. కోతకు వచ్చిన మామిడి కాయలు రాలి పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజంపేట మండలం ఆకేపాడు, మందపల్లి, హస్తవరం, పెద్దకారంపల్లి, మిట్టమీదపల్లి, పులపుత్తూరు, కూచివారిపల్లి, వరదయ్యగారిపల్లి, ఊటుకూరు పంచాయతీల్లో సాగు చేస్తున్న అరటి తోటలు పూర్తిగా నేలకొరిగాయి. మొత్తం 190 మంది రైతులు సాగు చేసిన 483 ఎకరాల్లో అరటి తోటలకు రూ.3.86 కోట్ల నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
జిల్లా అంతటా భారీ వర్షం : జిల్లాలోని 30 మండలాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బి.కొత్తకోటలో 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మదనపల్లెలో 72, రామా పురంలో 60.2, వీరబల్లిలో 55.2, రైల్వేకోడూరులో 50.2, ములకలచెరువులో 49.4, రాజంపేటలో 48.6, సుండుపల్లిలో 42.0, పెద్దమండెంలో 39.2, పుల్లంపేటలో 38.0, పీటీఎంలో 32.6, పెనగలూరులో 32.0 మిల్లీ మీటర్ల చొప్పున నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ 10 నుంచి 30 మిల్లీ మీటర్లలోపు వర్షం కురిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM