logo

జగన్‌ డ్రామాలు ప్రజలు నమ్మరు

సీఎం జగన్‌ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవి పేర్కొన్నారు.

Published : 10 May 2024 02:32 IST

చక్రాయపేట, న్యూస్‌టుడే : సీఎం జగన్‌ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్‌ రవి పేర్కొన్నారు. మండలంలోని నాగలగుట్టపల్లె, దేవరగుట్టపల్లె, కె.యర్రగుడి తదితర గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సొంత చెల్లెళ్లే జగన్‌ను నమ్మకపోతే ప్రజలు ఎలా నమ్మి ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. ‘మా బాబాయిని చంపింది అవినాష్‌రెడ్డే అని చెల్లెలు చెబుతుంటే.. ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నారని’ విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తే తరిమికొడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు