మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
గొల్లలగూడూరులో మహిళల సమస్యలు తెలుసుకుంటున్న షర్మిల
లింగాల, వేముల, న్యూస్టుడే : మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. గురువారం లింగాల మండలం పార్నపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, అంబకపల్లె, వేముల మండలంలోని గొల్లలగూడూరు, చింతలజూటూరు, పెద్దజూటూరు, సిద్దంరెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జే బ్రాండ్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. వైకాపా పాలనలో మద్యం, ఇసుక మాఫియా పెరిగిపోయాయన్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవన్నారు. ఎంత సరకు విక్రయిస్తున్నారో లెక్కల్లేవని మండిపడ్డారు. అంతా జీరో అకౌంట్, ఇది సరిపోనట్లు కంటైనర్లలో డ్రగ్స్ సరఫరా అవుతోందన్నారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్నా పది కొత్త పరిశ్రమలు కూడా రాకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం జగన్ మూడు రాజధానులు కడతానన్నారు. ఒక్కటైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన అవినాష్రెడ్డి జిల్లాకు ఏమి చేశారని ప్రశ్నించారు. సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించలేదన్నారు. మరోసారి ఆయనకు ఓట్లేసి మోసపోవద్దని కోరారు. ఎన్నికల్లో అవినాష్ ఓటమి చవిచూడడం ఖాయమన్నారు. ఓటమిని ముందుగానే తెలుసుకుని ఇతర దేశాలకు పారిపోయేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ.. వివేకా ఆత్మకు శాంతి కలగాలంటే హస్తం గుర్తుకు ఓటువేసి షర్మిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి ధ్రువకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
[ 19-05-2024]
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..