జగన్ సభ వెలవెల
సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా రాజంపేటలో గురువారం సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వెలవెలబోయింది.
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంపై నిరాశ
ప్రారంభంలోనే ఇంటి ముఖం పట్టిన జనం
జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
రాజంపేట గ్రామీణ, రాజంపేట, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా రాజంపేటలో గురువారం సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వెలవెలబోయింది. మధ్యాహ్నం 4 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా, 4.15 గంటలకు ప్రచార వాహనంపైకి జగన్ వచ్చారు. చాలా మంది ప్రజలు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు దుకాణాల నీడన తలదాచుకున్నారు. సభ నేపథ్యంలో రాజంపేట పాత బస్టాండు సమీపంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. అనంతరం సీఎం జగన్ 40 నిమిషాల పాటు ప్రసంగించి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగంలో కొత్తదనం లేదు.
సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో తిరిగి వెళ్లిపోతున్న మహిళలు, ప్రజలు
రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగింది. రాజంపేటలో సభ కోసం పాత బస్టాండు రహదారిలోని దుకాణాలను పోలీసులు ఉదయం నుంచే మూయించారు. బ్యారికేడ్లు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలు నిషేధించారు. సభ కోసం మధ్యాహ్నానికి జనాలు తీసుకొచ్చారు. తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. సభకు వచ్చిన జనానికి వైకాపా నేతలు మద్యం సీసాలు పంపిణీ చేశారు. రాజంపేట నుంచి రాపూరు, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు చక్రాలమడుగు వద్ద ఉంచడంతో ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రజలు ఇబ్బందులుపడ్డారు. చిట్వేలికి వెళ్లాల్సిన విద్యార్థులు డివైడర్పైనే నిల్చుని బస్సులు కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. సీఎం జగన్ ప్రసంగం మొదలు పెట్టిన పది నిమిషాలకే మహిళలు, ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. పోలీసులు విధించిన నిబంధనలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజంపేట ప్రధాన రహదారులపై వాహనాలు తిరిగేందుకు అనుమతులు లేవని చెప్పడంతో ప్రజలు, ఆసుపత్రికి వచ్చే రోగులు, చిన్న చిన్న పనులు చేసుకుని ఇళ్లకు వెళ్లే కూలీలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల